శుభవార్త.. ఒక్కరోజులోనే వీసా, వారికి ఒక్క నిముషంలోనే ఇమిగ్రేషన్ క్లియరెన్స్!
భారతదేశంలో వీసా జారీపైన కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు వీసా జారీ చేయడానికి కొన్ని వారాల సమయం పట్టేది. కానీ ఇకపై అన్ని పత్రాలు సమర్పిస్తే ఒక్క రోజులోనే వీసాను పొందే అవకాశాన్ని కల్పించేందుకు కేంద్రప్రభుత్వం నిబంధనల్లో వెసులుబాటు తీసుకొచ్చింది. అక్రమ వలసదారులు, గడువుమించి ఉండే విదేశీయులపై పర్యవేక్షణను మరింత బలోపేతం చేసేందుకు డిస్ట్రిక్ట్ పోలీస్ మాడ్యూల్, ఫారినర్స్ ఐడెంటిఫికేషన్ పోర్టల్ అనే రెండు కొత్త పోర్టల్స్ ను ప్రారంభించింది.
వీసాల విధానాలపై చర్చించిన బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్లో విదేశీ విభాగం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వీసాల విధానాల సరళతరం, ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టుల ఆధునీకరణ వంటి అంశాలపై కీలక చర్చ జరిపారు. ఈ సందర్బంగా ఆయా అంశాల్లో పురోగతిని అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. వీసా విధానాన్ని సులభతరం చేసేందుకు అనేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

కొన్ని వారాల నుండి ఒక్క రోజుకే తగ్గిన వీసా జారీ సమయం
గతంలో వీసా పొందేందుకు 26 సబ్ కేటగిరీలుండగా వాటిని 22కి కుదించామని, అట్లాగే గతంలో 104 సబ్ కేటగిరీలుంటే 69కి తగ్గించినట్లు వెల్లడించారు. 2024లో జారీ చేసిన మొత్తం వీసాలలో ఈ వీసాల వాటా (e-Visas) వాటా 65.15 శాతం పేర్కొన్నారు. వీసా విధానాల సులభతరం వల్ల వీసా జారీ సగటు సమయం కొన్ని వారాల నుండి ఒక్క రోజుకే తగ్గినట్లు తెలిపారు.
ఈ నగరాల్లో అమల్లో ఫాస్ట్-ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రాం
ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టుల ఆధునీకరణలో భాగంగా ఆటోమేటెడ్ ట్రావెల్ డాక్యుమెంట్ స్కానింగ్, బయోమెట్రిక్ నమోదు సదుపాయాలను కల్పించినట్లు అధికారులు పేర్కొన్నారు. 2014 నాటికి దేశంలో 82 ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టులుండగా, ప్రస్తుతం 114కి పెంచినట్లు వివరించారు. అట్లాగే ఢిల్లి, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, అహ్మదాబాద్లలో ఫాస్ట్-ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రాం (FTI-TTP) అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
వారికి ఒకే ఒక్క నిమిషంలోనే ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్
ప్రీ-వెరిఫైడ్ ప్రయాణికులు ఈ విమానాశ్రయాల్లో కేవలం ఒకే ఒక్క నిమిషంలోనే ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ పొందవచ్చునని తెలిపారు. త్వరలో ఈ సౌకర్యాన్ని కోజికోడ్, లక్నో, తిరువనంతపురం, అమృత్సర్, తిరుచిరాపల్లి, నోయిడా, నవి ముంబై విమానాశ్రయాలకు విస్తరించనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు సుమారు 50 లక్షల ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డులు జారీ చేసినట్టు వెల్లడించారు.
వారి కోసం "CAA-2019" మొబైల్ యాప్
OCI పోర్టల్ను పునరుద్ధరించి మరింత సులభమైన సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లకు చెందిన 6 నిర్దిష్ట మైనారిటీ సమూహాల పౌరసత్వ దరఖాస్తుదారులకు సాయం చేయడానికి "CAA-2019" మొబైల్ యాప్ అభివృద్ధి చేసినట్లు వివరించారు. ఈ సందర్బంగా అధికారుల పనితీరును అభినందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ వీసా, ఇమ్మిగ్రేషన్ విషయంలో ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications