Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజకీయాలకు, కుటుంబానికి గుడ్‌బై: లాలూ కూతురు నిర్ణయం వెనుక అసలు కథ!

Lalu Family Rift: బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో అంతర్గత కలహాలు ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఘోర పరాజయం పాలైన వెంటనే లాలూ కుమార్తె రోహిణి ఆచార్య రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడమే కాకుండా.. తన సోదరుడు, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్, ఆయన సన్నిహితులపై తీవ్ర ఆరోపణలు చేశారు.

రోహిణి ఆచార్య ఆరోపణలు వెనుక అసలు కారణం
పార్టీ ఓటమిని అంగీకరించలేని కారణంగానే తనపై దాడి జరిగిందని.. తనను కుటుంబం నుంచి బహిష్కరించారని రోహిణి ఆచార్య ఆరోపించారు. పాట్నాలో ఆమె మీడియాతో మాట్లాడుతూ చేసిన ప్రకటనలు సంచలనం సృష్టించాయి. "నాకు ఇప్పుడు కుటుంబం లేదు. దీని గురించి సంజయ్ యాదవ్, రమీజ్, తేజస్వి యాదవ్‌లను అడగవచ్చు. వారే నన్ను కుటుంబం నుంచి బహిష్కరించారు" అని రోహిణి స్పష్టం చేశారు. పార్టీ ఓటమి గురించి ప్రశ్నిస్తే ఈ ఇద్దరు సన్నిహితుల పేర్లు చెప్పినందుకే తనను అవమానించారని, దూషించారని, చెప్పుతో కూడా కొట్టారని ఆరోపించడం లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలోని చీలిక ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తుంది.

Goodbye Politics and Family The Real Story Behind Rohini Acharya Explosive Exit from Lalu Yadav Family

తేజస్వి యాదవ్ వెనుక ఉన్న ఇద్దరు సన్నిహితులు వీరే..
రోహిణి ఆచార్య ఆరోపణలు చేసిన సంజయ్ యాదవ్, రమీజ్ ఆలం ఇద్దరూ తేజస్వికి అత్యంత కీలకంగా వ్యవహరించేవారు. సంజయ్ యాదవ్ ఆర్జేడీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. తేజస్వి యాదవ్ రాజకీయ, వ్యూహాత్మక నిర్ణయాలలో సంజయ్ యాదవ్ చాలా కీలకమైన వ్యక్తిగా పరిగణించబడతారు. రమీజ్ ఆలం ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి, తేజస్వికి దీర్ఘకాలంగా సన్నిహిత మిత్రుడు. పార్టీ నష్టానికి కారణాలను బహిరంగంగా ప్రశ్నించడం, ముఖ్యంగా ఈ ఇద్దరు సన్నిహితుల పేర్లు చెప్పడం వల్లే తనకు ఈ పరాభవం ఎదురైందని రోహిణి ఆరోపిస్తున్నారు.

యాదవ్ కుటుంబంలో అంతర్గత యుద్ధం
రోహిణి ఆచార్య ప్రకటన లాలూ కుటుంబంలోని అంతర్గత కలహాలను మరోసారి బహిర్గతం చేసింది. "నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. నా కుటుంబాన్ని వదులుకుంటున్నాను. దీనికి మొత్తం నింద నేనే తీసుకుంటున్నాను" అని ఆమె ఒక వైరల్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ సంఘటనకు ముందే రోహిణి సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా వ్యక్తిగత వివాదాల కారణంగా ఈ సంవత్సరంలో ప్రారంభంలోనే పార్టీ, కుటుంబం నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఒకరి తర్వాత ఒకరు కుటుంబానికి దూరం కావడం, లాలూ యాదవ్ రాజకీయ వారసత్వంపై తీవ్ర ప్రభావం చూపవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఓటమి ప్రభావం
ఈ అంతర్గత పోరాటానికి ప్రధాన నేపథ్యం బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కావడం గమనార్హం. ఆర్జేడీ సుమారు 140కి పైగా సీట్లలో పోటీ చేసినా కేవలం 25 సీట్లతో మూడో స్థానానికి పరిమితమై ఘోరంగా ఓటమి పాలైంది. ఈ ఓటమి పర్యవసానంగానే కుటుంబంలో ఘర్షణలు తారాస్థాయికి చేరినట్లు రోహిణి ఆరోపణల ద్వారా స్పష్టమవుతోంది. అధికార ఎన్‌డీఏ 202 సీట్లు గెలుచుకుని, బీజేపీ (89 సీట్లు) అతిపెద్ద పార్టీగా అవతరించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+