విజయ్ మాల్యా బకాయి రద్దుపై అరుణ్ జైట్లీ స్పందన
న్యూఢిల్లీ: విజయ మాల్యా సహా 63 మంది డిఫాల్టర్ల బకాయిల రద్దు పైన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం నాడు స్పందించారు. ప్రభుత్వం మాల్యా కేసును పరిశీలిస్తోందని, బకాయిలను రద్దు చేయలేదని ఆయన చెప్పారు.
కాగా, రూ.500, వెయ్యి నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అరుణ్ జైట్లీ తన ఫేస్బుక్ కవర్ పేజీపై ఓ నినాదాన్ని ఉంచారు.

'భారతదేశం నల్లధనంతో ఎక్కువ కాలం ఉండద'ని కవర్ పేజీలో పేర్కొన్నారు. నల్లధనాన్ని భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో భరించదని, దేశాభివృద్ధికి నీతి, చిత్తశుద్ధి, నైతిక ప్రవర్తన ఆవశ్యమని జైట్లీ పేర్కొన్నారు.
వ్యాపారులు, రైతులతో భేటీ కానున్న కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం నాడు వ్యాపారులు, రైతులు, కార్మికులతో సమావేశమై పెద్ద నోట్ల రద్దు విషయంపై చర్చించనున్నారు. గురువారం ఉదయం పదకొండు గంటలకు ఆజాద్పూర్మండీ వద్ద రైతులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించి, పెద్ద నోట్ల రద్దు వలన సామాన్యప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చర్చించనున్నట్లు కేజ్రీవాల్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications