చెన్నైకి గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావ్: స్పీకర్, పార్టీ చీప్ విప్ భేటీ, రెబల్ ఎమ్మెల్యేలు !

సోమవారం చెన్నైకి గవర్నర్ విద్యాసాగర్ రావ్స్పీకర్ ధనపాల్ తో అన్నాడీఎంకే పార్టీ చీప్ విప్ రాజేంద్రన్ భేటీస్పీకర్ నోటీసులకు మేము సమాధానం ఇవ్వం: దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలు

చెన్నై: తమిళనాడు ఇన్ చార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావ్ ఈనెల 18వ తేదీ సోమవారం చెన్నై వస్తున్నారు. గవర్నర్ సోమవారం కచ్చితంగా చెన్నై వస్తారని గురువారం తమిళనాడు అడ్వకేట్ జనరల్ మద్రాసు హైకోర్టుకు సమాచారం ఇచ్చారు.

అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ చీప్ విప్ రాజేంద్రన్ గురువారం సచివాలయంలో స్పీకర్ ధనపాల్ ను కలిసిమరోసారి మనవి చేశారు. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

TN in charge Governor CH Vidhyasagar Rao will reach Chennai on Monday.

ఈ సందర్బంలో రెబల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యాలని అన్నాడీఎంకే పార్టీ చీప్ విప్ రాజేంద్రన్ స్పీకర్ ధనపాల్ కు మరో సారి మనవి చేశారు. కర్ణాటకలోని కొడుగు సమీపంలోని రిసార్ట్ లో జల్సా చేస్తున్న అన్నాడీఎంకే పార్టీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు మాత్రం మేము స్పీకర్ ధనపాల్ నోటీసులకు సమాధానం ఇవ్వమని మరోసారి తేల్చి చెప్పారు. ఇప్పుడు స్పీకర్ ధనపాల్ రెబల్ ఎమ్మెల్యేల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో అంటూ తమిళనాడు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+