ఆ రెండు కంపెనీల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ఆర్డర్ రద్దు.. కేంద్రం కీలక నిర్ణయం..
కరోనా వైద్య పరీక్షల కోసం చైనీస్ కంపెనీల నుంచి కొనుగోలు చేసిన యాంటీబాడీ టెస్ట్ కిట్స్లో లోపాలు బయటపడటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోపాలు బయటపడ్డ రెండు కంపెనీల ఆర్డర్స్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆర్డర్ రద్దు కారణంగా భారత్కు ఒక్క రూపాయి కూడా నష్టం వాటిల్లదని స్పష్టం చేసింది. ఆ రెండు కంపెనీల ఆర్డర్స్కు భారత్ డబ్బు చెల్లించలేదని.. కాబట్టి వాటిని తిరిగి పంపిస్తామని వెల్లడించింది.ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల కొనుగోలుకు కేంద్రం దాదాపుగా రెట్టింపు ధరను చెల్లిస్తోందని ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన మరుసటిరోజే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
కిట్ల కొనుగోలు ధరపై వివాదం..
కేంద్ర
ప్రభుత్వం
రియల్
మెటబాలిక్స్
అనే
భారతీయ
డిస్ట్రిబ్యూటర్
ద్వారా
చైనీస్
కంపెనీల
నుంచి
ర్యాపిడ్
టెస్ట్
కిట్స్ని
కొనుగోలు
చేసింది.
కానీ
ఈ
డిస్ట్రిబ్యూటర్కి,
మాట్రిక్స్
అనే
ఇంపోర్టర్
కంపెనీకి
మధ్య
వివాదం
తలెత్తింది.
అది
కాస్త
ఢిల్లీ
హైకోర్టుకు
చేరింది.
మ్యాట్రిక్స్
సంస్థ
రూ.245
చొప్పున
ఒక్కో
కిట్ను
చైనా
కంపెనీల
నుంచి
కొనుగోలు
చేయగా..
రియల్
మెటబాలిక్స్,ఆర్క్
ఫార్మాసూటికల్స్
ఇవే
కిట్లను
ఒక్కోదాన్ని
రూ.600
చొప్పున
కేంద్రానికి
విక్రయించారన్న
వాదన
వినిపిస్తోంది.
దీనిపై
విచారణ
చేపట్టిన
కోర్టు
ఒక్కో
కిట్పై
రూ.400
తగ్గించాలని
ఆదేశించింది.
ఒక్క రూపాయి నష్టం లేదన్న కేంద్రం
'ఈ ఆర్డర్స్కు ఐసీఎంఆర్ ఎటువంటి చెల్లింపులు జరపలేదు. 100శాతం అడ్వాన్స్ చెల్లింపుల ప్రక్రియలో వీటిని కొనుగోళ్లు చేయలేదు. కాబట్టి భారత్కు ఒక్క రూపాయి కూడా నష్టం వాటిల్లదు.' అని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా వైద్య పరీక్షల సంఖ్యను పెంచేందుకు కేంద్రం చైనా నుంచి దాదాపు 5లక్షలకు పైగా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ను తెప్పించి పలు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. అయితే రాజస్తాన్ సహా పలు రాష్ట్రాల్లో వీటి పనితీరుపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల ఫలితాల్లో కచ్చితత్వంలో లోపాలు బయటపడటంతో రెండు రోజుల పాటు వీటిని ఉపయోగించవద్దని కేంద్రం ఆదేశాలిచ్చింది.
Recommended Video
లోపాలు బయటపడటంతో
లోపాలు
బయటపడ్డ
కిట్లను
క్షేత్రస్థాయిలో
ఐసీఎంఆర్
కూడా
పరిశీలించింది.
Guangzhou
Wondfo
Biotech,
Zhuhai
Livzon
Diagnostics
కిట్లు
పనితీరుపై
అసంతృప్తి
వ్యక్తం
చేసింది.
ఈ
కిట్ల
వల్ల
ఉపయోగం
లేదని..
కాబట్టి
వీటిని
ఉపయోగించకూడదని
నిర్ణయించింది.
దీంతో
కేంద్రం
ప్రభుత్వం
ఇప్పటికే
తెప్పించిన
ఆర్డర్స్ను
తిరిగి
వెనక్కి
పంపించేందుకు
సిద్దమైంది.