గత ఐదేళ్లలో ఇదే అత్యల్పం?: పీఎఫ్ పై వడ్డీరేటు ఎంతో తెలుసా!
న్యూఢిల్లీ: ఉద్యోగ భవిష్య నిధి(పీఎఫ్)పై వడ్డీరేటుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు 2017-18 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ వడ్డీరేటును 8.55శాతంగా నిర్ఱయించారు. దీనికి సంబంధించిన ఈపీఎఫ్వో ట్రస్టీల బోర్డు నిర్ణయానికి ఆర్థికశాఖ ఆమోదముద్ర వేసింది.
ప్రస్తుతం కర్ణాటక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. ఎన్నికల నియమావళి రీత్యా ఇప్పుడే దీని ప్రకటించే అవకాశం లేదు. ఎన్నికల సంఘం అనుమతి రాగానే, కేంద్ర కార్మికశాఖ దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది. దీంతో పీఎఫ్ ఖాతాలు కలిగిన 5కోట్ల మంది చందాదారులకు ఈ వడ్డీ మొత్తాన్ని జమ చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియను ఈవారంలోనే పూర్తి చేయనున్నట్టు సమాచారం.

కాగా, గత ఐదేళ్లలో పీఎఫ్ పై అమలుచేసిన వడ్డీ రేట్లలో ఇదే అత్యల్పం కావడం గమనార్హం. 2015-16లో 8.88శాతంగా ఉన్న వడ్డీరేటు, 2016-17లో 8.65శాతానికి, 2017-18లో 8.55శాతానికి తగ్గించారు. ప్రస్తుతం నిర్ణయించిన వడ్డీరేటును కూడా మరింత తగ్గించాలని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. చివరాఖరికి ఈపీఎఫ్వో ట్రస్టీల బోర్డు నిర్ణయానికే కేంద్ర ఆర్థికశాఖ ఆమోదముద్ర వేసింది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications