Budget 2020: ఇంటింటికీ తాగునీరు కోసం 3.6 లక్షల కోట్లు, ఐదేళ్లలో సమూలంగా టీబీ నివారణ
ఇంటింటికీ సురక్షితమైన మంచినీరు అందిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందుకోసం 2020-21 బడ్జెట్లో 3.6 లక్షల కోట్లను కేటాయిస్తామని పేర్కొన్నారు. సురక్షితమైన మంచినీరు ఇవ్వడంతో వ్యాధులు ప్రబలకుండా అడ్డుకొనే వీలుంటుందని చెప్పారు. దేశంలో జ్వరాలు, ఇతర వ్యాధులు పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం, పరిశుభ్రమైన నీరు లేకపోవడమేనని పేర్కొన్నారు.
వాటర్ గ్రిడ్..?
ఇంటింటికీ మంచినీరు అందిస్తామనే కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేపెట్టబోతుంది. ఇది తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాటర్ గ్రిడ్ పథకాన్ని ఆదర్శంగా తీసుకొన్నట్టు తెలుస్తోంది. ఇంటింటికీ మంచినీరు అని తెలంగాణ ప్రభుత్వం వాటర్ గ్రిడ్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రూ.40 వేల కోట్లతో పైలట్ ప్రాజెక్టు చేపట్టి 95 శాతం ఆవాసాలకు నీరు అందిస్తున్నారు. తెలంగాణను ఆదర్శంగా తీసుకొని పథకం ప్రవేశఫెట్టినట్టు తెలుస్తోంది.
రైతుబంధు..
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకున్న సంగతి తెలిసిందే. కిసాన్ సన్మాన్ యోజన పేరుతో రైతులకు మూడు పర్యాయాలు రూ.6 వేల అందజేస్తోంది. తెలంగాణలో తొలుత ఎకరానికి రూ.4.. తర్వాత ఎకరానికి రూ.5 వేల చొప్పున అందజేశారు. కానీ కేంద్రం మాత్రం ఎంత భూమి ఉన్న రూ.6 వేలు మూడు విడతలుగా అందించనుంది.
పీపీపీ మోడ్
పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్లో భాగంగా మెడికల్ కాలుజీలను జిల్లా ఆస్పత్రులను అనుసంధానిస్తామని విత్త మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దీంతో జిల్లా ఆస్పత్రుల్లో రోగులకు నిరంతరాయంగా వైద్య సేవలు అందించే వీలుంటుందని చెప్పారు.
విదేశాల్లో కూడా..
అవసరాన్ని బట్టి వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రి/ లేదంటే మెడికల్ కాలేజీలో రోగులకు వైద్య సేవలు అందిస్తారు. విదేశాల్లో నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి మంచి డిమాండ్ ఉందని నిర్మలా సీతారామన్ గుర్తుచేశారు. ఆరోగ్య సంరక్షణకోసం కేటాయింపులు గతేడాది కంటే పెరిగాయి. 64 కోట్ల నుంచి 69 కోట్లకు పెంచుతున్నట్టు పేర్కొన్నారు.
2025లో నో టీబీ
టీబీని
సమూలంగా
నివారించేందుకు
చర్యలు
తీసుకుంటున్నామని
వివరించారు.
2025
వరకు
దేశం
నుంచి
టీబీ
తరమికొడతామని
చెప్పారు.
స్వచ్ఛ
భారత్
కోసం
12
వేల
300
కోట్లు
కేటాయిస్తున్నామని
పేర్కొన్నారు.
చేపల
ఉత్పత్తి
కూడా
200
లక్షల
టన్నుల
లక్ష్యం
పెట్టుకున్నామని
గుర్తుచేశారు.
అంతకుముందు
బడ్జెట్కు
కేంద్ర
క్యాబినెట్
ఆమోదం
తెలిపింది.