వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పన్ను సంఖ్య పెంచాలి: భారత ఆర్థిక సర్వే హైలెట్స్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 2016-17 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థికవృద్ధి రేటు 7 నుంచి 7.5 శాతం ఉండే అవకాశం ఉందని ఆర్థిక సర్వే వెల్లడించింది. శుక్రవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ 2016-17 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.

అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే-2016లోని ముఖ్యాంశాలు:

పన్నులు:
* దేశాభివృద్ధి కోసం పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచాలి.
* సంపాదిస్తున్న వారిలో కేవలం 5.5 శాతం మంది మాత్రమే పన్ను చెల్లింపు జాబితాలో ఉన్నారు.
* వీరిని 20 శాతానికి చేర్చాలి.

ద్రవ్యోల్బణం:
* తగ్గుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలకు మేలు.
* వినియోగ సూచి ఆధారిత ద్రవ్యోల్బణం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4.5 నుంచి 5 శాతం మధ్య కొనసాగే అవకాశం.
* ధరల స్థిరత్వానికి సూచిక కూడా..
* మార్చి 2017లోగా 5 శాతం ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) చేరుకుంటుంది.

Govt tables Economic Survey in Parliament

కరంట్ ఖాతాల లోటు:
* జీడీపీలో కరంట్ ఖాతాల లోటు 1 నుంచి 1.5 శాతం వరకూ ఉండే అవకాశం.

ద్రవ్యలోటు:
* 2016-17 ఎన్నో సవాళ్లను మన ముందు ఉంచనుంది.
* స్వల్పకాల ద్రవ్య విధానంపై సమీక్షించాల్సిన సరైన సమయం.
* మొత్తం స్థూల జాతీయోత్పత్తిలో 2015-16 ద్రవ్యలోటు 3.9 శాతం.
* ఈ లక్ష్యాన్ని అందుకోవడం సాధ్యమే.

బ్యాంకింగ్, కార్పొరేట్ రంగం:
* 2018-19 నాటికి బ్యాంకులకు రూ. 1.8 లక్షల కోట్ల మూలధనం అవసరం.
* ఒత్తిడిలో ఉన్న బ్యాంకులు నిరర్థక ఆస్తుల మొత్తాన్ని తగ్గించుకోకుంటే ప్రమాదమే.
* బ్యాంకింగ్ రంగంలో మరిన్ని ప్రైవేట్ పెట్టుబడులకు అవకాశాలు.
* కొనసాగనున్న డిజిన్వెస్ట్ మెంట్.
* ప్రభుత్వ సంస్థల్లో ప్రజల భాగస్వామ్యం పెరగాలి.

మరిన్ని ముఖ్యాంశాలు:
* పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో భారత్ ఉంది.
* మొత్తం పాలల్లో 18.5 శాతం భారత్‌లోనే
* గత పదేళ్లలో హార్టికల్చర్ విభాగం 2.7 శాతం చొప్పున విస్తరించింది.
* ఆహార ధాన్యాల కన్నా మెరుగైన దిగుబడి.
* డిమాండ్ ఉన్న పంటల దిశగా రైతులు సాగాలి.
* రైతులకు నియమిత మొత్తంలో సబ్సిడీ అవసరం.
* రైతుల సబ్సిడీ మొత్తాలు నేరుగా బ్యాంకుల్లోకే జమ.
* మొత్తం సబ్సిడీల బిల్లు జీడీపీలో 2 శాతం కన్నా కిందకు తేవాలి.
* జాతీయ ఆహార భద్రత, స్వచ్ఛ భారత్ వేగవంతమవ్వాలి.
* పోషకాహారం, పరిశుభ్రత దిశగా ఎంతో అభివృద్ధిని సాధించాలి.
* మేకిన్ ఇండియాకు మరింత ప్రోత్సాహం.
* ముడి చమురు ధరలు ఈ ఏడాదంతా బ్యారల్‌కు 35 డాలర్ల వద్ద కొనసాగే అవకాశం.
* దీని వల్ల భారత ఖజానాకు మేలు జరుగుతుంది.
* ఇండియాలో కరెంటు బిల్లులు తగ్గే రోజులు భవిష్యత్తులో.
* దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి పెరుగుతోంది.
* ఇండియాలో పౌల్ట్రీ, మత్స్య పరిశ్రమలకు ఆదరణ బాగా పెరిగింది.
* ఈ రెండు విభాగాల్లో గణనీయమైన వృద్ధి.

English summary
The Economic Survey for 2015-16 tabled in Parliament on Friday pegged India's growth for the next fiscal at 7-7.5 percent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X