వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్ లో 50 వేల ఆలయాలు, పాఠశాలలను పునరుద్ధరిస్తాం: త్వరలో సర్వే: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్ర హోదా కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని విభజించి, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తరువాత అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టబోతున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి తెలిపారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం చోటు చేసుకున్న పరిణామాల వల్ల జమ్మూ కాశ్మీర్ లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం ప్రస్తుతం తగ్గుముఖం పట్టిందని అన్నారు. భారత్ లో విలీనమైన తరువాత జమ్మూ కాశ్మీర్ రూపు రేఖలను మార్చేయాల్సి ఉందని, సమగ్రంగా అభివృద్ధి చేయడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు ఆయన వెల్లడించారు.

రాజ్యాంగం తెలియని వీడు చీఫ్ సెక్రెటరీ అంట: ఎల్వీ సుబ్రహ్మణ్యంపై మాజీ ఎంపీ షాకింగ్ కామెంట్స్రాజ్యాంగం తెలియని వీడు చీఫ్ సెక్రెటరీ అంట: ఎల్వీ సుబ్రహ్మణ్యంపై మాజీ ఎంపీ షాకింగ్ కామెంట్స్

సోమవారం ఆయన బెంగళూరుకు వచ్చారు. కర్ణాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వెంకటాచలతో భేటీ అయ్యారు. భారతీయ జనతాపార్టీ చేపట్టిన జన సంపర్క్ కార్యక్రమంలో భాగంగా.. కిషన్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం జమ్మూ కాశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. అనంతరం కిషన్ రెడ్డి స్థానిక బీజేపీ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Govt to conduct survey of defunct schools, temples in Kashmir: G Kishan Reddy

జమ్మూ కాశ్మీర్ లో 50 వేలకు పైగా ఆలయాలు నాశనం అయ్యాయని అన్నారు. వాటన్నింటినీ జీర్ణోద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీనికోసం సమగ్ర సర్వేను నిర్వహించబోతున్నామని అన్నారు. అనేక ఆలయాలు, విగ్రహాలు, దేవతా మూర్తులు ధ్వసం అయ్యాయని చెప్పారు. 50 వేలకు పైగా ఆలయాలు దశాబ్దాల తరబడి తెరచుకోలేని అన్నారు. అలాంటి వాటిని గుర్తించి, జీర్ణోద్ధరించడానికి నిధులను కేటాయిస్తామని చెప్పారు. వేలాది పాఠశాలలు, విద్యాసంస్థలు మూత పడ్డాయని, వాటిని కూాడా పునరుద్ధరించడానికి సర్వే నిర్వహిస్తామని అన్నారు.

English summary
Minister of State (MoS) for Home Affairs G Kishan Reddy today in Bengaluru said that a committee has been set up to survey the number of schools that are closed in the Kashmir valley, adding that the government will reopen the schools after the survey. He also said that over 50,000 temples have remained defunct over the years, of which some are destroyed, while in others the idols were defaced. A survey will also be done regarding that.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X