"జీఎస్టీతో 5లక్షల ఉద్యోగాలు.. యువతను రెండు రకాలుగా చూడాలనుకుంటున్నాం!"
ఉపాధికి కావాల్సిన ఔత్సాహిక నైపుణ్యాలను అందించడంతో పాటు, స్వయం ఉపాధి కల్పించే అవకాశాలపై తాము ఫోకస్ చేసినట్లు తెలిపారు.
ఇండోర్: కేంద్రం ప్రభుత్వం అమలు చేయబోతున్న జీఎస్టీ(వస్తు సేవల పన్ను) సంస్కరణల ద్వారా దేశంలో 5లక్షల కొత్త ఉద్యోగాల కల్పన జరగబోతుందని కేంద్ర స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ సహాయశాఖమంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ స్పష్టం చేశారు.
ఇప్పటికే అన్ని రాష్ట్రాలు జీఎస్టీకి ఆమోదం తెలిపే పనిలో నిమగ్నమైనందువల్ల రాబోయే రోజుల్లో కంప్యూటర్ ఆపరేటర్ల కోసం భారీగా కొత్త ఉద్యోగాలు ఏర్పడనున్నాయని అన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతోపాటు ఫైనాన్స్ సంబంధిత సబ్జెక్టుల్లో అవగాహన ఉన్న 5లక్షల మంది కంప్యూటర్ ఆపరేటర్లు దీని ద్వారా లబ్ది పొందుతారని చెప్పారు.

విద్యానగర్ ప్రాంతంలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపాధికి కావాల్సిన ఔత్సాహిక నైపుణ్యాలను అందించడంతో పాటు, స్వయం ఉపాధి కల్పించే అవకాశాలపై తాము ఫోకస్ చేసినట్లు తెలిపారు. దేశ యువతను తాము రెండు విధాలుగా చూడాలనుకుంటున్నామని చెప్పిన కేంద్రమంత్రి.. అందులో 'ఉద్యోగం కోరేవారు, ఉద్యోగం ఇచ్చేవారు' ఉంటారని చెప్పారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications