'ప్రతి నెలా జీఎస్టీ అంచనా రూ.లక్ష కోట్లు, తగ్గుతూ వచ్చిన ఆదాయం'
ఢిల్లీ: రానున్న ఆర్థిక సంవత్సరం నుంచి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) ద్వారా వచ్చే ఆదాయం ప్రతి నెల లక్ష కోట్ల వరకు ఉండే అవకాశముందని కేంద్రం భావిస్తోంది. ప్రతి నెల లక్ష కోట్ల మార్కు దాటుతుందని కేంద్రం అంచనా వేస్తోంది.
పన్ను వివరాలు సరిపోల్చడం, ఎలక్ట్రానిక్ వే బిల్లు వంటి పన్ను ఎగవేత నివారణ చర్యలతో ఈ మేరకు జీఎస్టీ వ్యవస్థ గాడిన పడుతుందని ఆర్థిక శాఖ భావిస్తోంది.

గత ఏడాది జూలై 1న జీఎస్టీ అమల్లోకి రాగా తొలి నెలలో రూ.95వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని, ఆ తర్వాత నెల నెలా తగ్గుతూ వచ్చింది. గత ఏడాది డిసెంబర్ నెలలో జీఎస్టీ ఆదాయం 6703 కోట్లకు క్షీణించింది.
ఆదాయంలో గణనీయమైన తగ్గుదల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమయింది. బంగారం క్రయ విక్రయాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయడంపై దృష్టి పెట్టింది. జీఎస్టీ అమల్లోకి వచ్చాక తొలి ఎనిమిది నెలల్లో రూ.4 లక్షల 44వేల కోట్ల ఆదాయం వచ్చింది. 2018-19లో రూ.7 లక్షలకు పైగా వస్తుందని కేంద్రం అంచనా వేసింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications