జడ్డూ భాయ్ భార్యకు బీజేపీ టికెట్, జామ్ నగర్ నుంచి బరిలోకి రివాబా జడేజా
గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక కోసం బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. ఆ 100 మందిలో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రీవాబా కూడా ఉన్నారు. టికెట్ల కేటాయింపును బీజేపీ ఆచి తూచి ఎంపిక చేసింది. చాలా మంది కొత్తవారికే అవకాశం కల్పించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 38 మందికి అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన పలువురు నేతలకు టికెట్ ఇచ్చారు.
నార్త్ జామ్ నగర్ నుంచి రివాబా జడేజా పోటీ చేస్తారు. రవీంద్రా జడేజాతో రీవాబాకు 2016లో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఆమె మూడేళ్ల క్రితం బీజేపీలో చేరారు. పార్టీలో ఉత్సాహంగా పని చేస్తున్నారు. కర్ణి సేన నాయకురాలు కూడా.. ప్రముఖ రాజకీయ నేత హరిసింగ్ సోలంకికి రీవాబా దగ్గరి బంధువు అవుతారు. రివాబా జడేజా 1990 సెప్టెంబర్ 5వ తేదీన జన్మించారు. మెకానికల్ ఇంజినీరింగ్ అత్మియ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలీజీ అండ్ సెన్స్ కాలేజీలో పూర్తి చేశారు. పెళ్లయ్యాక.. బీజేపీలో చేరారు.

గత కొన్ని నెలల క్రితం పార్టీలో చేరిన హర్థిక్ పటేల్కు బీజేపీ టికెట్ కేటాయించింది. అలాగే మోర్బి ఘటన సమయంలో నదిలోకి దూకి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ట్రై చేసిన మాజీ ఎమ్మెల్యే కాంతిలాల్కు మళ్లీ టికెట్ కేటాయించింది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలుగా జరగనున్నాయి. డిసెంబర్ 1వ తేదీన 89 నియోజకవర్గాలకు 5 వ తేదీన 93 నియోజకవర్గాలకు ఎన్నిక జరగనుంది. డిసెబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఈ ఎన్నికలో ఆరో సారి గెలిచి.. అధికారం చేపడుతామని బీజేపీ ధీమాతో ఉంది. గుజరాత్ పోల్పై ఆప్ కూడా ఆశలు పెట్టుకుంది. అధికారం చేపడుతామని అంటోంది. కాంగ్రెస్ పార్టీ అంతగా ప్రభావం చూపకోవచ్చు. ఆ పార్టీ ప్రభ క్రమంగా తగ్గుతూ వస్తోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications