బీజేపీకి శుభ సంకేతం: గుజరాత్ ఉపపోరులో ఘన విజయం
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి ఉపఎన్నికల ఫలితాలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. గుజరాత్ స్ధానిక సంస్థల ఉపపోరులో బీజేపీ దూసుకెళ్లింది.
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి ఉపఎన్నికల ఫలితాలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. గుజరాత్ స్ధానిక సంస్థల ఉపపోరులో బీజేపీ దూసుకెళ్లింది.
మంగళవారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో ఏడు జిల్లాల పరిధిలోని ఏడు మున్సిపాలిటీలకు గాను ఐదింట బీజేపీ విజయం సాధించింది. వీటికి తోడు ఒక తాలూకా పంచాయితీలోనూ బీజేపీ గెలుపొందింది.
తాజాగా ఉప ఎన్నికలు జరిగిన ఎనిమిది చోట్ల గతంలో బీజేపీ కేవలం రెండు సీట్లలోనే గొలుపొందింది. దీంతో బీజేపీ బలం మూడు రెట్లు పెరగ్గా, గతంతో పోలిస్తే కాంగ్రెస్ గెలుచుకున్నమున్సిపాల్టీల సంఖ్య సగానికి పడిపోయింది.
బొరైవి, మహుధ, విజపూర్, పటాన్, తలాలా మున్సిపాల్టీల్లో బీజేపీ గెలుపొందింది. గాంధీనగర్ జిల్లాలోని రంధేజా తాలూకా పంచాయితీ సీటునూ ఆ పార్టీ కైవసం చేసుకుంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో స్థానిక ఉప పోరులో సానుకూల ఫలితాలు రావడం పట్ల బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.