మసీదుపై మూక దాడి, నమాజ్ చేస్తున్నవారిని కొట్టారు: కేసు నమోదు
న్యూఢిల్లీ: గురుగ్రామ్ గ్రామంలోని మసీదుపై దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడిన డజను మందిపై గురుగ్రామ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారు మసీదును ధ్వంసం చేయడమే కాకుండా నమాజ్ చేస్తున్న వ్యక్తులను కూడా కొట్టారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ సంఘటన బుధవారం సాయంత్రం భోరా కలాన్ ప్రాంతంలో జరిగింది.
దాడికి పాల్పడిన దుండగులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. అయితే గురువారం సాయంత్రం వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. స్థానిక మసీదుపై కొందరు వ్యక్తులు దాడి చేసి ధ్వంసం చేశారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఆ గుంపు.. అక్కడి వారిని కొట్టి, భక్తులను చంపుతామని బెదిరించారు. కొట్టిన అనంతరం గేటు మూసి నిందితులు పరారయ్యారు. ప్రస్తుతం నిందితులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఈ సమయంలో దాడి చేసిన వారి ఉద్దేశ్యం ఏమిటి?, వారు ఎందుకు? ఈ సంఘటనకు పాల్పడ్డారు అనేది స్పష్టంగా తెలియలేదు. సాయంత్రం కొందరు మసీదులో నమాజ్ చేస్తుండగా, కొందరు వ్యక్తులు లోపలికి ప్రవేశించి వారిని కొట్టారని బిలాస్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుదారు సుబేదార్ నాజర్ మహ్మద్ తెలిపారు. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టమని ముస్లింలను బెదిరించారని కూడా ఆయన పేర్కొన్నారు.
పోలీసులు IPC సెక్షన్లు 295-A, 323, 506, 147, 148 కింద కేసు నమోదు చేశారు. రాజేష్ చౌహాన్ అలియాస్ బాబు, అనిల్ భడోరియా, సంజయ్ వ్యాస్ అనే ముగ్గురు నిందితులను కూడా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. త్వరలోనే ఈ ఘటనకు పాల్పడిన నిందితులను గుర్తించి జైలుకు పంపుతామన్నారు. దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని విచారణ అధికారి ఏఎస్ఐ గజేందర్ సింగ్ తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications