ఉద్యోగులతో భేటీకి అనుమతివ్వం: రాహుల్ గాంధీకి హెచ్ఏఎల్ షాక్
బెంగళూరు: హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ఉద్యోగులతో సమావేశం కావాలనుకున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. తమ సంస్థ ఆవరణలో ఉద్యోగులతో రాహుల్ గాంధీ భేటీ అయ్యేందుకు అంగీకరించేది లేదని హెచ్ఏఎల్ తేల్చి చెప్పింది.
కాగా, అక్టోబర్ 13న హిందూస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఉద్యోగులతో రాహుల్ సమావేశం కావాలనుకున్నారు. హెచ్ఏల్ పనితీరును తెలుసుకుందామనే రాహుల్ ఈ సమావేశం కావాలనుకున్నారని కాంగ్రెస్ నేతలు చెప్పారు.
#BIGNEWS: #HAL denies permission to #AICC president @RahulGandhi to interact with its employees on the premises. Rahul was scheduled to interact with HAL employees on October 13. pic.twitter.com/iynMX5kqhk
— NEWS9 (@NEWS9TWEETS) October 11, 2018
రాఫెల్ ఒప్పందాన్ని హెచ్ఏఎల్ నుంచి లాక్కుని రిలయన్స్ డిఫెన్స్కు కట్టబెట్టారంటూ నరేంద్ర మోడీ ప్రభుత్వంపై రాహుల్ విరుచుకుపడుతున్న సంగతి తెలిసింది. కాగా, రాఫెల్ డీల్ నేపథ్యంలోనే హెచ్ఏఎల్ ఉద్యోగులతో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

ఫ్రాన్స్ సంస్థ డసాల్ట్ ఏవియేషన్కు ఆఫ్సెట్ భాగస్వామిగా ప్రభుత్వ సారథ్యంలోని హెచ్ఏఎల్ సంస్థను కాదని వ్యాపారవేత్త అనిల్ అంబానికి చెందిన రిలయన్స్ను ఎందుకు ఎన్నుకున్నారో ప్రధాని మోడీని రాహుల్ ప్రశ్నిస్తున్నారు. ఇదో భారీ కుంభకోణమంటూ ఆరోపణలు కూడా చేస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications