కేజ్రీకి మోడీ బర్త్ డే విషెస్..! 'ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన'
న్యూఢిల్లీ : ఉప్పు-నిప్పులా ఎప్పుడూ చిటపటలాడే ఇద్దరు వ్యక్తుల మధ్య.. ఓ ఆత్మీయ సంభాషణ చోటు చేసుకుంటే ఎలా ఉంటుంది. ప్రధాని మోడీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మధ్యన ఇప్పుడదే జరిగింది. ఎప్పుడూ ఉండే రాజకీయ విమర్శలను కాస్త పక్కనబెట్టేసి ఇద్దరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. అయితే ఇదంతా ట్విట్టర్ లో.
కేజ్రీవాల్ పుట్టినరోజు సందర్బంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'కేజ్రీ దీర్ఘ ఆయురారోగ్యాలతో జీవించాలని తాను ప్రార్థించినట్టు' ట్విట్టర్ లో పేర్కొన్నారు మోడీ. మోడీ శుభాకాంక్షలు తెలపడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ.. ఆయనకు తన ట్వీట్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు కేజ్రీ.
ఏదేమైనా మొత్తానికి బద్ద శత్రువుల్లా ఉండే ఇద్దరి మధ్య ఆత్మీయ పలకరింపులు చోటు చేసుకోవడం.. ఇటు రాజకీయ వర్గాలతో పాటు అటు నెటిజన్స్ ను కూడా ఆకట్టుకుంటోంది. కాగా, నేటితో 48వ వడిలోకి అడుగుపెట్టారు కేజ్రీవాల్.
Birthday greetings to Delhi CM @ArvindKejriwal. I pray for his long life and good health.
— Narendra Modi (@narendramodi) August 16, 2016