Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమిత్ షా కాళ్లు పట్టుకునే ఖర్మ ఇంకా మాకు పట్టలేదు, మా నాన్న కాళ్లు మీరే పట్టుకుని !

బెంగళూరు: కేంద్ర హఓమ్ మంత్రి అమిత్ షా (amit shah) కాళ్లు పట్టుకునేందుకే తాను ఢిల్లీ వెళ్లానంటూ కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖార్గే చేసిన వ్యాఖ్యలపై ఆరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఎదురుదాడి చేశారు. బెంగళూరులో బుధవారం మాజీ సీఎం కుమారస్వామి (kumaraswamy) మీడియాతో మాట్లాడుతూ అమిత్ షా (amit shah)కాళ్లు పట్టుకునే స్థాయికి మేము ఇంకా దిగజారలేదని కౌంటర్ ఇచ్చారు.

బెంగళూరులోని మా ఇంటికి వచ్చి మాజీ ప్రధాని దేవెగౌడ కాళ్లు మీరే పట్టుకున్నారని, ఆ విషయం మీకు తెలియదా, ఇప్పుడు సిగ్గు లేకుండా జేడీఎస్ గురించి మాట్లాడవద్దని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గేపై (congress) కుమారస్వామి (kumaraswamy) మండిపడ్డారు. పొత్తుల గురించి మాట్లాడుతూ బీజేపీ, జేడీఎస్‌ల ఎమ్మెల్యేలంతా కలిసే ఉన్నారని, రెండు పార్టీలు మిత్రపక్షాలేనని కుమారస్వామి (kumaraswamy)అన్నారు.

HD Kumaraswamy countered the minister that he did not go to Delhi to hold Amit Shahs legs

బీఎస్ యడ్యూరప్పతో పాటు సదానందగౌడ, కటీల్ నాయకులుగా ఉన్నారు. దేశాన్ని కాపాడకుండా మీరే ప్రజలకు ద్రోహం చేశారు. మనమందరం కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని (congress) ఏర్పాటు చేయడంతో అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయని కుమారస్వామి (kumaraswamy) కాంగ్రెస్ మీద మండిపడ్డారు. రాజకీయాల కోసమే కాదని, ప్రజల కోసం బీజేపీ, జేడీఎస్ పార్టీలు కలిసి ఉంటాయని అంటున్నారు.

HD Kumaraswamy countered the minister that he did not go to Delhi to hold Amit Shahs legs

మన దేశంలోని, కర్ణాటక రైతుల ప్రయోజనాలను కాపాడటానికి బీజేపీ, జేడీఎస్ ఒక్కటి అయ్యిందని కుమారస్వామి (kumaraswamy) అన్నారు. రైతుల కష్టాలను మీరే చూసుకున్నారు. దీనిపై సలహా ఇచ్చేందుకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చినా మేము చెప్పిన సూచనలను పరిగణనలోకి తీసుకోలేదు. మనం కావేరి (congress)నీటిని కాపాడుకోవడానికి బాధ్యతాయుతంగా పని చెయ్యాలని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, అందుకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం చెయ్యడానికి మేము సిద్దం అయ్యామని కుమారస్వామి (kumaraswamy)అన్నారు.

మండ్యలోని విశ్వేశ్వర విగ్రహం దగ్గర కావేరి నీటి కోసం పెద్ద గొడవ జరుగుతోంది. అయితే కావేరి ట్రిబ్యునల్ తీర్పు తర్వాత కూడా ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. గత బీజేపీ-జేడీఎస్ ప్రభుత్వం (congress)చేసిన పోరాటం వల్ల 2018లో 14 టీఎంసీల మిగులు జలాలు వచ్చాయి. స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు చెప్పిందని కుమారస్వామి (kumaraswamy)గుర్తు చేశారు.

HD Kumaraswamy countered the minister that he did not go to Delhi to hold Amit Shahs legs

14 ఏళ్ల తర్వాత అలాంటి పరిస్థితి వచ్చింది. అది మీ ప్రభుత్వ బాధ్యత. దీన్ని బోర్డు ముందుంచాలని కుమారస్వామి సిద్దరామయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్ణాటక, తమిళనాడు రెండు రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా యూనియన్ వ్యవస్థను గౌరవించాలి. రాజకీయం అంటే ఇదేనేమో అనే లాగా కర్ణాటకలోని కాంగ్రెస్ (congress) ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని కుమారస్వామి (kumaraswamy)ఆరోపించారు. రాజకీయాలను కలపవద్దని, అధికారంలో ఉన్న ప్రభుత్వం కావేరి నీటి విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ సీఎం కుమారస్వామి (kumaraswamy) సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+