సీఎంకు చుక్కెదరు: ఆయనో ‘కింగ్’, ఏమైనా చేయగలరన్న సీబీఐ
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్కు చుక్కెదురైంది. ఈ కేసులో ఆయనకు బెయిల్ ఇవ్వరాదని సీబీఐ పేర్కొంది.
డెహ్రాడూన్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్కు చుక్కెదురైంది. ఈ కేసులో ఆయనకు బెయిల్ ఇవ్వరాదని సీబీఐ పేర్కొంది. అక్రమాస్తుల కేసులో బెయిల్ కోరుతూ సీఎం వీరభద్రసింగ్, ఆయన భార్య పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం పాటియాలా హౌస్కోర్టులో విచారణ చేపట్టారు.
అక్రమాస్తుల కేసులో బెయిల్ మంజూరు చేయాలని గతవారం వీరభద్రసింగ్ పాటియాలా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ దరఖాస్తుపై తమ స్పందన తెలియజేయాలని కేసును విచారిస్తున్న సీబీఐను న్యాయస్థానం ఆదేశించింది.

ఇందుకు వారం గడువు ఇచ్చింది. దీంతో సీబీఐ సోమవారం తమ నివేదికను కోర్టుకు అందించింది. సీఎం, ఆయన భార్యకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు సీబీఐ నివేదికలో పేర్కొంది. బెయిల్ ఇస్తే.. కేసు తప్పుదోవ పట్టే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది.
'సీఎం వీరభద్రసింగ్కు రాష్ట్రంలో చాలా పరపతి ఉంది. రాష్ట్రానికి ఆయనో రాజు(కింగ్). అంతేగాక, అనేక అవినీతి కేసుల్లో ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇక వైద్య పరమైన సమస్యలు అంటే అవి సాధారణమే. అందుకే ఆరోగ్య సమస్యల పరంగా ఆయనకు బెయిల్ ఇవ్వడం కుదరదు' అని సీబీఐ తేల్చి చెప్పింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications