సీఎంకు చుక్కెదరు: ఆయనో ‘కింగ్’, ఏమైనా చేయగలరన్న సీబీఐ
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్కు చుక్కెదురైంది. ఈ కేసులో ఆయనకు బెయిల్ ఇవ్వరాదని సీబీఐ పేర్కొంది.
డెహ్రాడూన్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్కు చుక్కెదురైంది. ఈ కేసులో ఆయనకు బెయిల్ ఇవ్వరాదని సీబీఐ పేర్కొంది. అక్రమాస్తుల కేసులో బెయిల్ కోరుతూ సీఎం వీరభద్రసింగ్, ఆయన భార్య పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం పాటియాలా హౌస్కోర్టులో విచారణ చేపట్టారు.
అక్రమాస్తుల కేసులో బెయిల్ మంజూరు చేయాలని గతవారం వీరభద్రసింగ్ పాటియాలా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ దరఖాస్తుపై తమ స్పందన తెలియజేయాలని కేసును విచారిస్తున్న సీబీఐను న్యాయస్థానం ఆదేశించింది.

ఇందుకు వారం గడువు ఇచ్చింది. దీంతో సీబీఐ సోమవారం తమ నివేదికను కోర్టుకు అందించింది. సీఎం, ఆయన భార్యకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు సీబీఐ నివేదికలో పేర్కొంది. బెయిల్ ఇస్తే.. కేసు తప్పుదోవ పట్టే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది.
'సీఎం వీరభద్రసింగ్కు రాష్ట్రంలో చాలా పరపతి ఉంది. రాష్ట్రానికి ఆయనో రాజు(కింగ్). అంతేగాక, అనేక అవినీతి కేసుల్లో ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇక వైద్య పరమైన సమస్యలు అంటే అవి సాధారణమే. అందుకే ఆరోగ్య సమస్యల పరంగా ఆయనకు బెయిల్ ఇవ్వడం కుదరదు' అని సీబీఐ తేల్చి చెప్పింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications