ఆత్మగౌరవం కోసం పోరాడాం: ఆఫ్రికాకు మోడీ సాయం
న్యూఢిల్లీ: ఆఫ్రికాలో ఆర్థిక వృద్ధి వేగం పుంజుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. గురువారం ఢిల్లీలో జరిగిన భారత్-ఆఫ్రికా ఫోరం సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. ఆఫ్రికా దేశాధినేతలు ఈ సదస్సులో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నామన్నారు. ఇది కేవలం భారత్-ఆఫ్రికా సదస్సు కాదు... మూడింట ఒకటో వంతు ప్రజల కలలకు సంబంధించినదని పేర్కొన్నారు.
ఆఫ్రికా అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం కావటం గౌరవంగా భావిస్తున్నామన్నారు. గత మూడేళ్లలో ఆఫ్రికాకు చెందిన 25వేల మంది యువత భారత్లో శిక్షణ పొందారని తెలిపారు. ఆఫ్రికా క్రీడలు, కళలు, సంగీతం ప్రపంచ దృష్టిని ఆకట్టుకున్నాయన్నారు.భారత్-ఆఫ్రికా భాగస్వామ్యంలో అభివృద్ధి అంశమే కీలకమని, ఆఫ్రికా దేశాల అభివృద్ధికి సాయం చేస్తామని వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆఫ్రికాకు 600 మిలియన్ డార్ల సాయం ప్రకటించారు. ఐదేళ్లలో ఆఫ్రికాకు 10మిలియన్ డాలర్ల రాయితీ రుణం అందిస్తామని తెలిపారు. ఆఫ్రికాలో వ్యవసాయ రంగం ప్రపంచ ఆహార భద్రతకు మద్దతుగా నిలుస్తుందన్నారు. ఆఫ్రికాలో డిజిటల్ సాంకేతికత అభివృద్ధికి అంతరిక్ష పరిజ్ఞానం అందుబాటులోకి తెస్తామన్నారు.

‘మనమంతా ఒకప్పుడు వలసపాలనలో ఉన్నాం. స్వాతంత్య్రం, ఆత్మగౌరవం కోసం పోరాడాం' అని గుర్తు చేశారు. భారత్, ఆఫ్రికాలో మూడింట రెండో వంతు మంది 35 ఏళ్ల లోపు వారేనని, మన భాగస్వామ్యంలో మానవ వనరుల అభివృద్ధి కీలమని స్పష్టం చేశారు. వన్యజీవుల సంరక్షణ, పర్యాటకంలో ఆఫ్రికా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తోందని పేర్కొన్నారు.
ఉగ్రవాదంపై పోరులో సహకారం మరింత బలపడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మన భాగస్వామ్యానికి పునాది కావాలని ఆకాంక్షించారు. ఐక్యరాజ్యసమితిలో సంస్కరణల కోసం భారత్, ఆఫ్రికా ఏకతాటిపై నిలవాలని మోడీ కోరారు.
కాగా, ఇండో-ఆఫ్రికన్ సదస్సు ముగింపు సందర్భంగా కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ప్రధాని మోడీతోపాటు విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్, 54దేశాల అధినేతలు పాల్గొన్నారు.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"












Click it and Unblock the Notifications