పక్షి ఢీకొనడం వల్లే ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిందా ? నిపుణులేమన్నారు ?
ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు అహ్మదాబాద్ లోని సర్దార్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ నలోని గాట్విక్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఏఐ171 బోయింగ్ విమానం కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలింది. ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ తీసుకున్న ఎయిర్ ఇండియా విమానం కాసేపటికే కిందకు దిగిపోతూ ఒక్కసారిగా కుప్పకూలిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ ఘటనలో దాదాపు 150 మంది మృత్యువాత పడినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఇలా ఎయిర్ ఇండియా విమానం ఎందుకు హఠాత్తుగా కిందికి దిగిపోయింది, ఇంత దారుణమైన ప్రమాదం జరగడం వెనుక ఏముందనే అంశంపై నిపుణులు విశ్లేషణలు అందిస్తున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్కు సరైన వేగాన్ని చేరుకోకుండా పక్షి ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిపుణులు ఎన్డీటీవీకి తెలిపారు.

230 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలట్లు, ఇలా మొత్తం 242 మందితో బయలుదేరిన బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం ఒక్కసారిగా కుప్పకూలడానికి పక్షి లేదా పక్షులు ఢీకొనడమే కారణమై ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. లేకుండా విమానం ఇలా హఠాత్తుగా కిందికి దిగిపోదని వారు స్పష్టం చేస్తున్నారు. వేల గంటలు అనుభవం ఉన్న పైలట్ విమానాన్ని ఇలా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించే అవకాశాలు కూడా లేవంటున్నారు.
I was in the same damn flight 2 hours before it took off from AMD. I came in this from DEL-AMD. Noticed unusual things in the place.Made a video to tweet to @airindia i would want to give more details. Please contact me. @flyingbeast320 @aajtak @ndtv @Boeing_In #planecrash #AI171 pic.twitter.com/TymtFSFqJo
— Akash Vatsa (@akku92) June 12, 2025
ఇదే అంశంపై మాజీ సీనియర్ పైలట్ కెప్టెన్ సౌరభ్ భట్నాగర్ ఎన్డీటీవీతో మాట్లాడుతూ ఇది ప్రాథమికంగా, బహుళ పక్షులను ఢీకొట్టిన కేసులాగా కనిపిస్తుందన్నారు. దీనిలో రెండు ఇంజిన్లు శక్తిని కోల్పోయాయని, టేకాఫ్ పరిపూర్ణంగా ఉన్నా గేర్ను పైకి లేపడానికి ముందు, విమానం క్రిందికి దిగడం ప్రారంభమైందని తెలిపారు. ఇది ఇంజిన్ శక్తిని కోల్పోయినప్పుడు లేదా విమానం లిఫ్ట్ జరగడం ఆగిపోయినప్పుడు మాత్రమే జరుగుతుందని వెల్లడించారు. ఫుటేజ్ ని గమనిస్తే ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగినట్లు కనిపిస్తోందని, విమానం నియంత్రిత పద్ధతిలో కూలిపోయిందని ఆయన తెలిపారు. పైలట్ మేడే కాల్ ఇచ్చాడని, అంటే అది ఒక విపత్కర పరిస్థితి అని అర్థమని ఆయన తెలిపారు.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!












Click it and Unblock the Notifications