జైలులో లాలూ: తోటమాలి పనికి రోజుకు రూ.93 సంపాదన
పాట్నా: పశుదాణా కుంభకోణంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ జైలులో తోట పని చేసినందుకు రోజుకు రూ.93 కూలీ లభిస్తోంది. దాణా కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్కు మూడున్నర ఏళ్ళపాటు జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఇటీవలనే తీర్పు చెప్పింది. దీంతో లాలూను బిర్సా ముండా జైలుకు తరలించారు.
లాలూ వయసును దృష్టిలో పెట్టుకుని. ఆయన చేయ గలిగిన పనులనే అప్పగిస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ప్రస్తుతం లాలూకు బిర్సా ముండా జైల్లో తోటపని అప్పగించారు. తోటపని చేసినందుకు లాలూకు రోజుకు 93 రూపాయల కూలీ లభిస్తుంది.

గడ్డి కుంభకోణంలో సీబీఐ కోర్టు తీర్పు వెలవరించిన వెంటనే లాలూ ప్రసాద్ యాదవ్ ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. లాలూ విడుదల చేసిన హిందీలో ఉండడం విశేషం.
లౌకికతత్వం, సామాజిక న్యాయం, సమానత్వం, దళితులు, వెనుకబడిన వర్గాల కోసంప్రాణాలైనా ఇస్తాగానీ.. కాషాయ పార్టీకి తలొగ్గేది లేదని లేఖలో ఆయన స్పష్టం చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లను లాలూ ప్రసాద్ యాదవ్ మనువాదులుగా అభివర్ణించారు.












Click it and Unblock the Notifications