తస్మాత్ జాగ్రత్త: ఈ రాష్ట్రాల్లోనే HIV కేసులు అధికంగా ఉన్నాయి
Recommended Video

భారతదేశంలో హెచ్ఐవీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గిపోవడం శుభవార్తగా నిలువగా... ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయా, మిజోరాం, త్రిపురా రాష్ట్రాల్లో మాత్రం ఎయిడ్స్ కేసులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయాలను కేంద్ర ఆరోగ్య కుటంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ లోక్ సభలో తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లో హెచ్ఐవీ కేసులు ఎందుకు పెరుగుతున్నాయో వివరణ ఇచ్చింది ఆ శాఖ.అక్కడ డ్రగ్స్ కేసులు ఎక్కువగా ఉండటం ఒక కారణమైతే... లైంగికంగా కలిసేటప్పుడు సరైన జాగ్రత్తలు పాటించడం లేదని మంత్రి తెలిపారు.
మిజోరాంలో నాలుగు ప్రాంతాల్లో, త్రిపురాలోని ఒక ప్రాంతంలో డ్రగ్స్ తీసుకుంటున్న వారిలోనే ఎక్కువగా హెచ్ఐవీ ఉన్నట్లు గుర్తించామని మంత్రి సభకు తెలిపారు. దేశం మొత్తం మీద ఇలాంటి కేసులు 6.3శాతంగా ఉన్నాయి. మరోవైపు ఐజ్వాల్లో డ్రగ్స్ తీసుకున్న వ్యక్తుల్లో హెచ్ఐవీ 37.44శాతం ఉండగా... చంపాయ్లో 33.06శాతం, కోలసిబ్ ప్రాంతంలో 38.14 శాతంగా ఉంది. ఈ నాలుగు ప్రాంతాల్లో కూడా మహిళల్లోనే ఎక్కువగా హెచ్ఐవీ కేసులు బయటపడ్డట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఎయిడ్స్ పై అన్ని ఈశాన్య రాష్ట్రాల్లోని జిల్లాల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సమీరన్ పండా. ఎయిడ్స్ బారినుంచి పడకుండా నివారణ మార్గాలు అన్వేషించాలని ఆయన చెప్పారు. అదే విషయమై జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. హెచ్ఐవీ సోకి ప్రస్తుతం 12.28లక్షల మంది చికిత్స పొందుతున్నారని చెప్పిన పాండా.. ఇంకా చాలామంది హెచ్ఐవీతోనే బాధపడుతున్నారని... అలాంటి వారికి చికిత్స అందేలా చూడాలని చెప్పారు. భారత్లో దాదాపు 21 లక్షల మంది హెచ్ఐవీతో బాధపడుతున్నారని అందులో కనీసం 90 శాతం మందికి చికిత్స చేయించడమే తన లక్ష్యం అని పాండా చెప్పారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications