Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Hijab Row: హైకోర్టు, ప్రభుత్వం ఏం చెప్పింది, టీచర్లు ఏం చేశారు, వీడియో వైరల్, స్పాట్ లో సస్పెండ్ !

బెంగళూరు/గదగ్: కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పరీక్షలు రాయడానికి వచ్చే విద్యార్థులు కచ్చితంగా యూనీఫామ్ వేసుకుని రావాలని విద్యాశాఖ అధికారులు గతవారమే ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు ఎవ్వరూ మతపరమైన దుస్తులు, హిజాబ్ లతో పాటు అలాంటి వస్త్రాలు వేసుకుని పరీక్షలకు హాజరుకాకూడదని విద్యాశాఖ అధికారులు కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు. హిజాబ్ లు వేసుకుని 10వ తరగతి పరీక్షలకు హాజరుకాకూడదని, హిజాబ్ లు వేసుకుని వస్తే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించమని విద్యాశాఖా అధికారులు తేల్చి చెప్పారు. ఈ సంవత్సరం 8. 73 వేల మంది విద్యార్థులు నేరుగా పరీక్షా కేంద్రాలకు హాజరై 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. రెండు రోజుల క్రితం కొందరు ముస్లీం అమ్మాయిలు హిజాబ్ లు వేసుకుని పరీక్షలు రాయడానికి వెళ్లారు.

పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక గదుల్లో హిజాబ్ లు తొలగించిన ముస్లీం అమ్మాయిలు యూనీఫామ్ మాత్రమే వేసుకుని పరీక్షలు రాశారు. కొన్ని చోట్ల పరీక్షా కేంద్రాల నుంచి ఇంటికి వెనుతిరిగి వెళ్లిన ముస్లీం అమ్మాయిలు హిజాబ్ లు తీసేసి యూనీఫామ్ వేసుకుని వెళ్లి 10వ తరగతి పరీక్షాలు రాశారు. అయితే ముస్లీం అమ్మాయిలు హిజాబ్ లు వేసుకుని 10వ తరగతి పరీక్షలు రాయడానికి అనుమతి ఇచ్చిన 7 మంది టీచర్లతో సహ ఇద్దరు చీఫ్ ఇన్విజిలేటర్ల మీద విద్యాశాఖా అధికారులు వేటు వేశారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన టీచర్ల మీద కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

 10వ తరగతి పరీక్షలు

10వ తరగతి పరీక్షలు

కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పరీక్షలు రాయడానికి వచ్చే విద్యార్థులు కచ్చితంగా యూనీఫామ్ వేసుకుని రావాలని విద్యాశాఖ అధికారులు గతవారమే ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు ఎవ్వరూ మతపరమైన దుస్తులు, హిజాబ్ లతో పాటు అలాంటి వస్త్రాలు వేసుకుని పరీక్షలకు హాజరుకాకూడదని విద్యాశాఖ అధికారులు కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు.

 హిజాబ్ విషయంలో జాగ్రత్త

హిజాబ్ విషయంలో జాగ్రత్త

హిజాబ్ లు వేసుకుని 10వ తరగతి పరీక్షలకు హాజరుకాకూడదని, హిజాబ్ లు వేసుకుని వస్తే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించమని విద్యాశాఖా అధికారులు తేల్చి చెప్పారు. ఈ సంవత్సరం 8. 73 వేల మంది విద్యార్థులు నేరుగా పరీక్షా కేంద్రాలకు హాజరై 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. రెండు రోజుల క్రితం కొందరు ముస్లీం అమ్మాయిలు హిజాబ్ లు వేసుకుని పరీక్షలు రాయడానికి వెళ్లారు.

 వెనక్కి పంపించిన అధికారులు

వెనక్కి పంపించిన అధికారులు

పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక గదుల్లో హిజాబ్ లు తొలగించిన ముస్లీం అమ్మాయిలు యూనీఫామ్ మాత్రమే వేసుకుని పరీక్షలు రాశారు. కొన్ని చోట్ల పరీక్షా కేంద్రాల నుంచి ఇంటికి వెనుతిరిగి వెళ్లిన ముస్లీం అమ్మాయిలు హిజాబ్ లు తీసేసి యూనీఫామ్ వేసుకుని వెళ్లి 10వ తరగతి పరీక్షాలు రాశారు. కర్ణాటక హైకోర్టు ఆదేశాలను అందరూ కచ్చితంగా పాటించాలని కర్ణాటక ప్రభుత్వంతో పాటు విద్యాశాఖ అధికారులు పదేపదే చెప్పారు.

 హిజాబ్ లు వేసుకుని పరీక్షలు రాసిన వీడియో వైరల్

హిజాబ్ లు వేసుకుని పరీక్షలు రాసిన వీడియో వైరల్

కర్ణాటకలోని గదగ్ లోని సీఎస్ పాటిల్ బాయ్స్ హైస్కూల్, సీఎస్ పాటిల్ గర్ల్స్ హైస్కూల్స్ లో కొందరు ముస్లీం అమ్మాయిలు హిజాబ్ లు వేసుకుని 10వ తరగతి పరీక్షలు రాశారు. కర్ణాటక హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి హిజాబ్ లు వేసుకుని పరీక్షలు రాశారని కొన్ని టీవీ చానల్స్ వార్తలు ప్రసారం చేశాయి. ముస్లీం అమ్మాయిలు హిజాబ్ లు వేసుకుని పరీక్షలు రాస్తున్న వీడియో సైతం ప్రసారం కావడం కలకలం రేపింది.

 స్పాట్ లో సస్పెండ్ చేసిన అధికారులు

స్పాట్ లో సస్పెండ్ చేసిన అధికారులు

ముస్లీం అమ్మాయిలు హిజాబ్ లు వేసుకుని 10వ తరగతి పరీక్షలు రాస్తున్న వీడియో మీడియాలో రావడంతో విద్యాశాఖ అధికారులు షాక్ అయ్యారు. గదగ్ తహసిల్దార్ సంఘటనా స్థలానికి వెళ్లి అక్కడి ప్రత్యక్షసాక్షులు, విద్యార్థులను విచారణ చేసి వివరాలు సేకరించారు. హిజాబ్ లు వేసుకుని పరీక్షలు రాయడానికి టీచర్లు అనుమతి ఇచ్చారని వెలుగు చూడటంతో వారిని స్పాట్ లో సస్పెండ్ చేశారు.

కఠినచర్యలు తీసుకుంటాము

కఠినచర్యలు తీసుకుంటాము

ముస్లీం అమ్మాయిలు హిజాబ్ లు వేసుకుని 10వ తరగతి పరీక్షలు రాయడానికి అనుమతి ఇచ్చిన 7 మంది టీచర్లతో సహ ఇద్దరు చీఫ్ ఇన్విజిలేటర్ల మీద విద్యాశాఖా అధికారులు, తహసిల్దార్ స్పాట్ లో సస్పెండ్ చేశారు. కర్ణాటక హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన టీచర్ల మీద కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

 ఎవరి కోసం చేశారు ?

ఎవరి కోసం చేశారు ?

ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న టీచర్లు ఎవరి కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ?, వీరి వెనుక ఎవరు ఉన్నారు ? అని ఆరా తీస్తున్నామని విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ బసవలింగప్ప మీడియాకు చెప్పారు. కర్ణాటక హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని టీచర్లను సస్పెండ్ చేశామని విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ బసవలింగప్ప మీడియాకు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+