Hijab Row: జడ్జ్ లకే వార్నింగ్, నిందితుల వెనుక ఎవరెవరు ఉన్నారు ?, ఎన్ఐఏ విచారణ ?, హోమ్ మంత్రి !
బెంగళూరు: హిజాబ్ వివాదం కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది. హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ముస్లీం అమ్మాయిలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ముస్లీం అమ్మాయిలు దాఖలు చేసిన పిటిషన్ విచారణ సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. హిజాబ్ వివాదంపై తీర్పు ఇచ్చిన కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులను చంపేస్తామని బెదిరించిన నిందితులకు అసలుసిసలైన సినిమా చూపించడానికి కర్ణాటక ప్రభుత్వం సిద్దం అయ్యింది.
హిజాబ్ వివాదంపై తీర్పు ఇచ్చిన సిట్టింగ్ జడ్జిలకే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని కర్ణాటక హోమ్ మంత్రి హెచ్చరించారు. హైకోర్టు న్యాయమూర్తులకు వార్నింగ్ ఇచ్చిన నిందితులు ఎవరు ?, వాళ్ల వెనుక ఎవరెవరు ఉన్నారు. ఆ సంస్థలు ఏవి ? అని పూర్తి సమాచారం బయటకు తియ్యడానికి కేసును NIAకి అప్పగించాలని ఆలోచిస్తున్నామని, త్వరలో నిర్ణయం తీసుకుంటామని హోమ్ మంత్రి అన్నారు. ఇప్పటికే తమిళనాడులో అరెస్టు అయిన నిందితులను బెంగళూరు తీసుకు వచ్చి విచారణ చెయ్యడానికి సీనియర్ పోలీసు అధికారులు సిద్దం అయ్యారు.

హైకోర్టు సంచలన తీర్పు
హిజాబ్ వివాదం కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది. హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ముస్లీం అమ్మాయిలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

సిట్టింగ్ జడ్జిలకే వార్నింగ్ ఇచ్చారు
ముస్లీం అమ్మాయిలు దాఖలు చేసిన పిటిషన్ విచారణ సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. హిజాబ్ వివాదంపై తీర్పు ఇచ్చిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులను చంపేస్తామని బెదిరించిన నిందితులకు అసలుసిసలైన సినిమా చూపించడానికి కర్ణాటక ప్రభుత్వం సిద్దం అయ్యింది.

తమిళనాడులో అరెస్టులు
కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులకు వార్నింగ్ ఇచ్చిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బెంగళూరులోని విదాన సౌధ పోలీస్ స్టేషన్ లో శ్రీరామసేన నాయకులు కేసు పెట్టారు. తమిళనాడులో కూడా నిందితుల మీద కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో తమిళనాడులో రహమత్ వుల్లాతో పాటు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

కేసు ఎన్ఐఏకి అప్పగించాలని !
హిజాబ్ వివాదంపై తీర్పు ఇచ్చిన సిట్టింగ్ జడ్జిలకే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర హెచ్చరించారు. సిట్టింగ్ జడ్జిలకే వార్నింగ్ ఇచ్చిన వారి వెనుక ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్న సమయంలో కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర ఆయన్ను కలిసిన ఓ కన్నడ మీడియా సంస్థకు ఈ విషయం చెప్పడం విశేషం.

ఎవరెవరు ఉన్నారు ?
కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులకు వార్నింగ్ ఇచ్చిన రహమత్ వుల్లాతో పాటు మిగిలిన నిందితుల వెనుక ఎవరెవరు ఉన్నారు వాళ్లు ఎవరు ?, వాళ్ల వెనుక ఎవరెవరు ఉన్నారు. ఆ సంస్థలు ఏవి ? అని పూర్తి సమాచారం బయటకు తియ్యడానికి కేసును NIAకి అప్పగించాలని ఆలోచిస్తున్నామని, త్వరలో నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర అన్నారు. ఇప్పటికే తమిళనాడులో అరెస్టు అయిన రహమత్ వుల్లాతో పాటు నిందితులను బెంగళూరు తీసుకు వచ్చి విచారణ చెయ్యడానికి సీనియర్ పోలీసు అధికారులు సిద్దం అయ్యారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications