Hijab Row: జడ్జ్ లకే వార్నింగ్, నిందితుల వెనుక ఎవరెవరు ఉన్నారు ?, ఎన్ఐఏ విచారణ ?, హోమ్ మంత్రి !
బెంగళూరు: హిజాబ్ వివాదం కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది. హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ముస్లీం అమ్మాయిలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ముస్లీం అమ్మాయిలు దాఖలు చేసిన పిటిషన్ విచారణ సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. హిజాబ్ వివాదంపై తీర్పు ఇచ్చిన కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులను చంపేస్తామని బెదిరించిన నిందితులకు అసలుసిసలైన సినిమా చూపించడానికి కర్ణాటక ప్రభుత్వం సిద్దం అయ్యింది.
హిజాబ్ వివాదంపై తీర్పు ఇచ్చిన సిట్టింగ్ జడ్జిలకే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని కర్ణాటక హోమ్ మంత్రి హెచ్చరించారు. హైకోర్టు న్యాయమూర్తులకు వార్నింగ్ ఇచ్చిన నిందితులు ఎవరు ?, వాళ్ల వెనుక ఎవరెవరు ఉన్నారు. ఆ సంస్థలు ఏవి ? అని పూర్తి సమాచారం బయటకు తియ్యడానికి కేసును NIAకి అప్పగించాలని ఆలోచిస్తున్నామని, త్వరలో నిర్ణయం తీసుకుంటామని హోమ్ మంత్రి అన్నారు. ఇప్పటికే తమిళనాడులో అరెస్టు అయిన నిందితులను బెంగళూరు తీసుకు వచ్చి విచారణ చెయ్యడానికి సీనియర్ పోలీసు అధికారులు సిద్దం అయ్యారు.

హైకోర్టు సంచలన తీర్పు
హిజాబ్ వివాదం కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది. హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ముస్లీం అమ్మాయిలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

సిట్టింగ్ జడ్జిలకే వార్నింగ్ ఇచ్చారు
ముస్లీం అమ్మాయిలు దాఖలు చేసిన పిటిషన్ విచారణ సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. హిజాబ్ వివాదంపై తీర్పు ఇచ్చిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులను చంపేస్తామని బెదిరించిన నిందితులకు అసలుసిసలైన సినిమా చూపించడానికి కర్ణాటక ప్రభుత్వం సిద్దం అయ్యింది.

తమిళనాడులో అరెస్టులు
కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులకు వార్నింగ్ ఇచ్చిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బెంగళూరులోని విదాన సౌధ పోలీస్ స్టేషన్ లో శ్రీరామసేన నాయకులు కేసు పెట్టారు. తమిళనాడులో కూడా నిందితుల మీద కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో తమిళనాడులో రహమత్ వుల్లాతో పాటు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

కేసు ఎన్ఐఏకి అప్పగించాలని !
హిజాబ్ వివాదంపై తీర్పు ఇచ్చిన సిట్టింగ్ జడ్జిలకే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర హెచ్చరించారు. సిట్టింగ్ జడ్జిలకే వార్నింగ్ ఇచ్చిన వారి వెనుక ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్న సమయంలో కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర ఆయన్ను కలిసిన ఓ కన్నడ మీడియా సంస్థకు ఈ విషయం చెప్పడం విశేషం.

ఎవరెవరు ఉన్నారు ?
కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులకు వార్నింగ్ ఇచ్చిన రహమత్ వుల్లాతో పాటు మిగిలిన నిందితుల వెనుక ఎవరెవరు ఉన్నారు వాళ్లు ఎవరు ?, వాళ్ల వెనుక ఎవరెవరు ఉన్నారు. ఆ సంస్థలు ఏవి ? అని పూర్తి సమాచారం బయటకు తియ్యడానికి కేసును NIAకి అప్పగించాలని ఆలోచిస్తున్నామని, త్వరలో నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర అన్నారు. ఇప్పటికే తమిళనాడులో అరెస్టు అయిన రహమత్ వుల్లాతో పాటు నిందితులను బెంగళూరు తీసుకు వచ్చి విచారణ చెయ్యడానికి సీనియర్ పోలీసు అధికారులు సిద్దం అయ్యారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications