Hijab Verdict: ఖురాన్ లో చెప్పినట్లు చేస్తున్నాము, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం, విద్యార్థులు !
బెంగళూరు/ ఉడిపి: హిజాబ్ అనేది ఇస్లాంలో భాగం కాదని, హిజాబ్ లు కచ్చితంగా వేసుకోవాలని ఇస్లాంలో లేదని కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది. హిజాబ్ లు వేసుకుని విద్యాసంస్థల్లోకి వస్తామని ముస్లీం అమ్మాయిలు చెప్పడం సరికాదని కర్ణాటక హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. హిజాబ్ లు వేసుకోవాలని పట్టుపట్టకూడదని కర్ణాటక హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆదేశాలను ప్రతి విద్యార్థి కచ్చితంగా పాటించాలని కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. అయితే ఖురాన్ లో ఉన్నట్లు మేము శరీరాన్ని కుప్పుకోవడానికి హిజాబ్ లు వేసుకుంటున్నామని, ఖురాన్ చెప్పినట్లు తాము నడుచుకుంటామని హిజాబ్ కోసం పోరాటం చేస్తున్న ముస్లీం అమ్మాయిలు అంటున్నారు. కర్ణాటక హైకోర్టులో మాకు న్యాయం జరుగుతుందని అనుకున్నామని, అయితే అలా జరగలేదని, హైకోర్టు తీర్పుతో మాకు అన్యాయం జరిగిందని ముస్లీం అమ్మాయిలు చెప్పారు. ఖురాన్ చెప్పినట్లు నడుచుకుంటామని, హిజాబ్ లు లేకుండా మేము కాలేజ్ కు వెళ్లము, పరీక్షలు రాయమని కర్ణాటక హైకోర్టులో హిజాబ్ కోసం పోరాటం చేసిన ఆరు మంది ముస్లీం అమ్మాయిలు తేల్చి చెప్పారు. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము సుప్రీం కోర్టులో సవాలు చేస్తామని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన ముస్లీం అమ్మాయిలు మంగళవారం మీడియాకు చెప్పారు.
Hijab verdict: సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన ముస్లీం అమ్మాయిలు, హిజాబ్, చదువు రెండు కావాలి !
హిజాబ్ పిటిషన్లు కొట్టివేత
హిజాబ్ అనేది ఇస్లాంలో భాగం కాదని, హిజాబ్ లు కచ్చితంగా వేసుకోవాలని ఇస్లాంలో లేదని కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది. హిజాబ్ లు వేసుకుని విద్యాసంస్థల్లోకి వస్తామని ముస్లీం అమ్మాయిలు చెప్పడం సరికాదని కర్ణాటక హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. హిజాబ్ లు వేసుకోవాలని పట్టుపట్టకూడదని కర్ణాటక హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆదేశాలను ప్రతి విద్యార్థి కచ్చితంగా పాటించాలని కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఇదే సమయంలో హిజాబ్ వివాదంలో దాఖలు అయిన అన్ని పిటిషన్లను కొట్టి వేసిన కర్ణాటక హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది.
ఖురాన్ లో చెప్పినట్లు చేస్తున్నాము
ఖురాన్ లో ఉన్నట్లు మేము శరీరాన్ని కుప్పుకోవడానికి హిజాబ్ లు వేసుకుంటున్నామని, ఖురాన్ చెప్పినట్లు తాము నడుచుకుంటామని హిజాబ్ కోసం పోరాటం చేస్తున్న ముస్లీం అమ్మాయిలు అంటున్నారు. కర్ణాటక హైకోర్టులో మాకు న్యాయం జరుగుతుందని అనుకున్నామని, అయితే అలా జరగలేదని, హైకోర్టు తీర్పుతో మాకు అన్యాయం జరిగిందని ముస్లీం అమ్మాయిలు చెప్పారు. కర్ణాటక హైకోర్టు తీర్పు వచ్చిన తరువాత కోర్టులో హిజాబ్ కోసం పిటిషన్లు దాఖలు చేసిన అమ్మాయిలు ఉడిపిలో మీడియాతో మాట్లాడారు.
న్యాయం జరిగే వరకు పోరాటం
ఖురాన్ చెప్పినట్లు నడుచుకుంటామని, హిజాబ్ లు లేకుండా మేము కాలేజ్ కు వెళ్లము, పరీక్షలు రాయమని కర్ణాటక హైకోర్టులో హిజాబ్ కోసం పోరాటం చేసిన ఆరు మంది ముస్లీం అమ్మాయిలు తేల్చి చెప్పారు. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును మేము గౌరవిస్తున్నామని ముస్లీం అమ్మాయిలు అన్నారు. అయితే మా పోరాటానికి ఫలితం దక్కలేదని, మాకు న్యాయం జరిగే వరకు న్యాయపోరాటం చేస్తామని ముస్లీం అమ్మాయిలు చెప్పారు.
చిన్న విషయాన్ని పెద్దది చేశారు
ఆ రోజు మేము హిజాబ్ లు వేసుకుని కాలేజ్ కు వెళ్లిన సమయంలో కాలేజ్ ప్రిన్సిపాల్ లోపకలికి వెళ్లడానికి అవకాశం ఇచ్చి ఉంటే హిజాబ్ వివాదం ఇంత పెద్దది అయ్యేది కాదని, కావాలనే కొందరు రాజకీయ స్వార్థం కోసం ఇంత వరకు తీసుకు వచ్చారని ముస్లీం అమ్మాయిలు ఆరోపించారు. హిజాబ్ వేసుకోవడం మా మతం ఆచారం అని ముస్లీం అమ్మాయిలు అంటున్నారు.
Recommended Video
న్యాయపోరాటం చేస్తాము
మాకు విద్యతో పాటు హిజాబ్ లు వేసుకోవడం ముఖ్యమని, మాకు రెండు కావాలని ముస్లీం అమ్మాయిలు అంటున్నారు. మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. హిజాబ్ విషయంలో మాకు న్యాయం జరిగే వరకు మేము సుప్రీం కోర్టును ఆశ్రయించామని న్యాయపోరాటం చేస్తామని ముస్లీం అమ్మాయిలు మీడియాకు చెప్పారు.