పరువు హత్య: వేరే కులానికి చెందిన వ్యక్తితో పెళ్ళి, కూతురిని చంపాడిలా
వేరే కులానికి చెందిన వాడవిని ప్రేమించి పెళ్ళిచేసుకొందనే అక్కసుతో ఓ తండ్రి తన కూతురుని నరికి చంపాడు. ఈ ఘటన మహరాష్ట్రలో చోటుచేసుకొంది.
ముంబై: వేరే కులానికి చెందిన వాడవిని ప్రేమించి పెళ్ళిచేసుకొందనే అక్కసుతో ఓ తండ్రి తన కూతురుని నరికి చంపాడు. ఈ ఘటన మహరాష్ట్రలో చోటుచేసుకొంది.
మహారాష్ట్ర బుల్ఢానా జిల్లాలో దారుణం చోటుచేసుకొంది. నింఖాడే గ్రామానికి చెందిన బాలు షివారే తన కుమార్తె మనీషా హింగానేకు పెళ్ళి సంబంధం ఖరారు చేశాడు.

ఏప్రిల్ 20వ, తేదిన పెళ్ళి ముహుర్తం కూడ నిర్ణయించారు.అయితే మనీషా అదే గ్రామానికి చెందిన గణేష్ ను ప్రేమించి అతనితో కలిసి పారిపోయింది.
ఈ ఏడాది మార్చి23వ, తేదిన గణేష్ ను పెళ్ళి చేసుకొంది.వారిద్దరూ ఇటీవలే గ్రామానికి వచ్చారు.భర్తతో కలిసి కుటుంబంతో ఆమె నివాసం ఉంటోంది.
బుధవారం నాడు సాయంత్రం కూతురు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అక్కడికి వెళ్ళిన బాలు ఆమెను వెంట తెచ్చుకొన్న గొడ్డలితో మెడపై నరికాడు.
కొంతసేపటి తర్వాత ఇంటికి వచ్చిన గణేష్ రక్తపు మడుగులో పడి ఉన్న భార్యను ఆసుపత్రికి తరలించారు. ఆమె అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు.నిందితుడు బాలు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళి లొంగిపోయాడు.పరాయి కులం వ్యక్తిని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేకనే తాను తన కూతురిని చంపానని ఆయన ఒప్పుకొన్నాడు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications