వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరువు హత్య: వేరే కులానికి చెందిన వ్యక్తితో పెళ్ళి, కూతురిని చంపాడిలా

వేరే కులానికి చెందిన వాడవిని ప్రేమించి పెళ్ళిచేసుకొందనే అక్కసుతో ఓ తండ్రి తన కూతురుని నరికి చంపాడు. ఈ ఘటన మహరాష్ట్రలో చోటుచేసుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: వేరే కులానికి చెందిన వాడవిని ప్రేమించి పెళ్ళిచేసుకొందనే అక్కసుతో ఓ తండ్రి తన కూతురుని నరికి చంపాడు. ఈ ఘటన మహరాష్ట్రలో చోటుచేసుకొంది.

మహారాష్ట్ర బుల్ఢానా జిల్లాలో దారుణం చోటుచేసుకొంది. నింఖాడే గ్రామానికి చెందిన బాలు షివారే తన కుమార్తె మనీషా హింగానేకు పెళ్ళి సంబంధం ఖరారు చేశాడు.

honor killing

ఏప్రిల్ 20వ, తేదిన పెళ్ళి ముహుర్తం కూడ నిర్ణయించారు.అయితే మనీషా అదే గ్రామానికి చెందిన గణేష్ ను ప్రేమించి అతనితో కలిసి పారిపోయింది.

ఈ ఏడాది మార్చి23వ, తేదిన గణేష్ ను పెళ్ళి చేసుకొంది.వారిద్దరూ ఇటీవలే గ్రామానికి వచ్చారు.భర్తతో కలిసి కుటుంబంతో ఆమె నివాసం ఉంటోంది.

బుధవారం నాడు సాయంత్రం కూతురు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అక్కడికి వెళ్ళిన బాలు ఆమెను వెంట తెచ్చుకొన్న గొడ్డలితో మెడపై నరికాడు.

కొంతసేపటి తర్వాత ఇంటికి వచ్చిన గణేష్ రక్తపు మడుగులో పడి ఉన్న భార్యను ఆసుపత్రికి తరలించారు. ఆమె అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు.నిందితుడు బాలు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళి లొంగిపోయాడు.పరాయి కులం వ్యక్తిని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేకనే తాను తన కూతురిని చంపానని ఆయన ఒప్పుకొన్నాడు.

English summary
father killed daughter in buldana at Maharastra state. Balu shivare murdered daugher
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X