పరువు హత్యలు: జీపులో లాక్ చేసి ముగ్గురి దహనం
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. 23 ఏళ్ల దళిత యువకుడితో పాటు అతని ఇద్దరు అనుచరులను సజీవంగా దగ్ధం చేశారు. వాటిని పరువు హత్యలుగా భావిస్తున్నారు. బాలఘాట్, సియోని జిల్లాల సరిహద్దుల్లో ఈ హత్యలు జరిగాయి. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
చంద్రబోజ్ (41), దీనదయాళ్ (30), శుభం (18), వినోద్ (25)లను పోలీసులు అరెస్టు చేశారు. హతులను తమ ఇంటికి చెందిన మైనర్ బాలికతో సంబంధం పెట్టుకున్నారనే ఆరోపణతో దీపక్ను, అతని ఇద్దరి అనుచరులను వారు గురువారంనాడు హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని బాలఘాట్లోని తిరోడీ పోలీసు స్టేషన్ ఇంచార్జీ ఇన్స్పెక్టర్ హరీష్ యాదవ్ పిటిఐ వార్తా సంస్థతో చెప్పారు.
పరువు కోసమే ఆ హత్యలు చేశారని ఆయన అన్నారు. చంద్రబోజ్, దీనదయాళ్, శుభంలను ఇంతకు ముందు అరెస్టు చేయగా, నాలుగో నిందితుడిని ఆ తర్వాత అరెస్టు చేశారు. బాలిక ఫోన్ నుంచి ఎస్ఎంఎస్ ఇచ్చి, ధోబీ తోలా ప్రాంతంలో కలవాలని చెప్పి ఆమె అన్నట్లు ఆ మెసేజ్ పంపించి, వారిని అక్కడికి రప్పించి హత్య చేసినట్లు చెబుతున్నారు.
ఆ మెసేజ్ చూసి అమ్మా.యిని కలవడానికి దీపక్, అతని మిత్రులు రాజేష్ (26), నిహాల్ (18) అక్కడికి వెళ్లారు. ఆ ముగ్గురిని నిందితులు కొట్టారు. ఆ ముగ్గురిని జీపులో బంధించి, జీపును తగులబెట్టారు. అమ్మాయి అంకుల్ చంద్రబోజ్ దీపక్ తమ అమ్మాయికి పంపిన సన్నిహితమైన మెసేజ్ చూసి ఆగ్రహంతో రెచ్చిపోయి, తన కుటుంబ సభ్యులతో కలిసి వారిని చంపినట్లు పోలీసులు చెప్పారు.