దెయ్యం పేరుతో దారుణం: భార్య ముఖంపై వేడి చేపల కూర!
కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. చేతబడి చేయించుకోవాలనే విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవ చివరకు తీవ్రమైన హింసకు దారితీసింది. భర్త తన భార్య ముఖంపై నేరుగా వేడిగా ఉడుకుతున్న చేపల కూరను పోయడంతో ఆమె తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైంది. ఈ దారుణ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
బాధితురాలు ఆస్పత్రికి తరలింపు
కొల్లాం జిల్లాంలోని చదయమంగళం సమీపంలోని వైక్కల్కు చెందిన రెజిలా గఫూర్ (36) ఈ దాడిలో తీవ్రంగా గాయపడింది. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు కారకుడైన ఆమె భర్త సజీర్ సంఘటన జరిగిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. ఎఫ్ఐఆర్ ప్రకారం.. బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో వారి అద్దె ఇంట్లో ఈ ఘటన జరిగింది.

చేతబడి కోసం వింత ఒత్తిడి
నిందితుడు సజీర్ కొంతకాలంగా తన భార్యపై వింత ఒత్తిడి తెస్తున్నాడు. చేతబడి చేసే వ్యక్తి ఇచ్చిన తావీజు కట్టించుకోవాలని, అలాగే తన జుట్టును విప్పుకుని, తన ముందు కూర్చోవాలని, బూడిద పూయించుకోవాలని ఆమెను బలవంతం చేశాడు. అయితే రెజిలా ఆ తాంత్రిక చర్యలకు పూర్తిగా నిరాకరించింది. ఆమె నిరాకరించడంతో ఆగ్రహించిన సజీర్.. వంటగదిలో వేడిగా ఉడుకుతున్న చేపల కూరను ఆమె ముఖంపై పోసి దాడి చేశాడు.
గతంలోనూ దాడులు.. హెచ్చరించిన పోలీసులు
రెజిలా గఫూర్ కేవలం ఈ ఒక్కసారి మాత్రమే కాకుండా.. గతంలోనూ తన భర్త నుంచి అనేక దాడులను ఎదుర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. సజీర్ తన భార్యకు దెయ్యం పట్టిందని బలంగా నమ్ముతున్నాడు. గతంలో కూడా దాడి జరిగినప్పుడు రెజిలా పోలీసులను ఆశ్రయించగా.. అప్పుడు సజీర్ను పోలీసులు హెచ్చరించి విడిచిపెట్టారు. అయితే ఆ తర్వాత కూడా అతను మారకుండా అంచల్లోని ఒక చేతబడి చేసే వ్యక్తిని సంప్రదించడం మొదలుపెట్టాడని అధికారులు వెల్లడించారు. ఆ వ్యక్తి సలహా మేరకే అతను ఈ దారుణానికి పాల్పడ్డాడు. రెజిలా ఒక టీవీ ఛానెల్తో మాట్లాడుతూ.. సజీర్ తరచుగా తమ కొడుకుపై కూడా దాడి చేసేవాడని ఆరోపించింది.
కేసు నమోదు, నిందితుడి కోసం గాలింపు
ఈ ఘటన జరిగిన అనంతరం బాధితురాలు రెజిలా అరుపులు విన్న పొరుగువారు వెంటనే స్పందించి ఆమెను రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణమైన దాడిపై పోలీసులు సజీర్పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications