ఎత్తుకు పైఎత్తు: ఢిల్లీకి శశికళ, ముంబైకి పన్నీరు.. రహస్య ప్రాంతానికి ఎమ్మెల్యేలు
అన్నాడీఎంకేలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, పార్టీ అధినేత్రి శశికళలు వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ఎప్పటికి అప్పుడు తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
చెన్నై: అన్నాడీఎంకేలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, పార్టీ అధినేత్రి శశికళలు వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ఎప్పటికి అప్పుడు తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
పన్నీరు సెల్వం ముంబై లేదా ఢిల్లీ వెళ్లి ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావును కలవనున్నారు. ఆయన సాయంత్రం బయలుదేరనున్నారు.

మరోవైపు, శశికళ వర్గం ఢిల్లీకి పయనమవుతోంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి గవర్నర్ తీరు పైన, రాష్ట్ర పరిస్థితులను వివరించనున్నారు. తమకు 130 మంది ఎమ్మెల్యేల బలం ఉందని వారు రాష్ట్రపతికి చెప్పనున్నారు.
క్యాంపు రాజకీయాలు
అన్నాడీఎంకేలో క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. శశికళ వర్గం ఎమ్మెల్యేలను ఓ బస్సులో గుర్తు తెలియని ప్రాంతానికి తరలించింది. శశికళకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. వారిని బస్సులో తరలించారు. వారందరినీ హోటల్స్కు తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications