కిరాతకం: 9 రోజుల పాటు 9 మంది మహిళపై సామూహిక అత్యాచారం, పిల్లల ఎదుటే అలా...
కర్ణాటక రాష్ట్రంలో ఓ గృహిణిపై 9 మంది 9 రోజుల పాటు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. నిందితులను బుదవారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
బెంగుళూరు:ఉత్తర కన్నడ జిల్లా హళియాళ తాలూకా గర్డోలి గ్రామానికి చెందిన ఓ గృహిణిపై తొమ్మిది మంది కీచకులు తొమ్మిదిరోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.బాధితురాలికి ఇద్దరు కుమారులున్నారు. భర్త చనిపోయాడు.
గత నెల 25వ, తేదిన బాధితురాలు తన పుట్టింటికి వెళ్ళేందుకు బస్టాప్ లో వేచి ఉంది.అయితే ఆసమయంలో అక్కడికి వచ్చి ఫయాజ్ మైసూర్ వాలె కారులో వచ్చి తాను కూడ గర్డోలికి వెళ్తున్నానని నమ్మించి ఆమెను కారులో ఎక్కించుకొన్నాడు.అయితే కారులోనే ఆమెపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు.అయితే ఆమె ప్రతిఘటించింది.దీంతో మౌనంగా ఉన్న నిందితుడు ఆమెను ఇంటి వద్ద దింపి వెళ్ళిపోయాడు.
అయితే ఆమె ఇంటి వద్ద ఒక్కతే ఉంటుందనే విషయాన్ని గమనించాడు. ఇంట్లో ఆమెతో పాటు ఇద్దరు కుమారులు మినహా ఎవరూ ఉండరనే విషయాన్ని గుర్తించాడు.రాత్రి పూట ఆమె ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై దాడి చేసి అత్యాచారం చేశాడు.అంతేకాదు ఆమెపై దాడికి దిగాడు.దీంతో తీవ్రంగా గాయపడింది.
మరునాడు మరో ఇద్దరు నిందితులు ఇంట్లోకి ప్రవేశించారు. మత్తు మందు కలిపిన ఆహరాన్ని తినిపించి రుసగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె స్పృహలోకి వచ్చినప్పుడు అత్యాచారం చేశారు.
మొత్తం తొమ్మిది మంది తొమ్మిది రోజుల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. పిబ్రవరి 25వ, తేది నుండి మార్చి 6వ, తేదివరకు బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
అయితే మార్చి 6వ, తేదిన కూడ అత్యాచారం చేస్తుండగా బాధితురాలు శక్తిని కూడగట్టుకొని కేకలు వేసింది.అయితే ఈ అరుపులు విని స్థానికులు వచ్చారు.అయితే నిందితులు పారిపోతుండగా ఒకరిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
అయితే నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేస్తే షాక్ కు గురయ్యారు.ఆమె నివాసం ఉంటున్న ఇంట్లోనే పిల్లల ఎదుటే దుండగులు ఈ రకంగా వ్యవహరించారు.బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారు. నిందితులు కిరాతకంగా వ్యవహరించారు.
ఫయాజ్ మైసూర్ వాలె, సిద్దిక్ బాగేవాడి, నియూజ్ హరూన్ సర్కావాస్, సిద్దిక్ ఖాన్, అలిఫ్ సయ్యద్, జమీల్ దేశాయి, ఇలియాస్ అంకోల్కర్ , నస్రుల్లా ఖాన్ లు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. 9 రోజుల పాటు కిరాతకంగా బాధితురాలిపై అత్యాచారం చేశారు.నిందితులను బుదవారం నాడు అరెస్టు చేశారు. అయితే బాధితురాలిని చికిత్స కొసం ఆసుపత్రికి తరలించారు.