దేశంలో నల్లధనం ఎంతో తెలుసా ?
దేశంలో సుమారు 33,441 కోట్ల నల్లధనం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఓ ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. 2014 నుండి 2016 వరకు సుమారు 31,277 కోట్లు, పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత సుమార
న్యూఢిల్లీ : దేశంలో సుమారు 33,441 కోట్ల నల్లధనం ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.లోక్ సభలో ఓ ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ రాతపూర్వకంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
నల్ల ధనంపై కేంద్రం యుద్దం ప్రకటించింది. ఈ మేరకు నవంబర్ 8వ, తేదిన పెద్ద నగదు నోట్లను రద్దు చేసింది. 2014 నుండి 2016 వరకు ఆదాయపు పన్నుశాఖ సుమారు 1356 నుంది సుమారు 31,277 కోట్లు నల్ల ధనం ఉన్నట్టు గుర్తించింది.ఈ మేరకు వారు కూడ ఈ ఆదాయానికి లెక్కలు చూపలేదని జైట్లీ వివరించారు.
నల్లధనంపై యుద్దంలో భాగంగా కేంద్రం తీసుకొన్న పెద్ద నగదు నోట్ల రద్దు చేసింది. దీని తర్వాత సుమారు 2,164 కోట్లను లెక్కలు చూపని నగదును ఆదాయపు పన్నుశాఖాధికారులు స్వాధీనం చేసుకొన్నారు.
దేశ వ్యాప్తంగా సుమారు 33,441 కోట్ల నల్లధనం ఉందని కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానంలో చెప్పారు. అయితే దేశంో కాకుండా విదేశాల్లో ఎంత నల్లధనం భారతీయులకు చెందినది ఉందనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు.












Click it and Unblock the Notifications