ఇక తరగతులకు జేఎన్యూ విద్యార్థులు: ఫీజు పెంపుపై వెనక్కి తగ్గిన కేంద్రం, పేద విద్యార్థులకు సహకారం
న్యూఢిల్లీ: హాస్టల్ ఫీజుల పెంపును నిరసిస్తూ ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ) విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేఎన్యూలో హాస్టల్ ఫీజులు పెంచడం లేదని జేఎన్యూ ఎగ్జిక్యూటివ్ కమిటీ, మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఆర్ సుబ్రమన్యం స్పష్టం చేశారు.
హాష్టల్ ఫీజు పెంచాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు జేఎన్యూ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించిందని సుబ్రమణ్యం తెలిపారు. అంతేగాక, ఆర్థికంగా బలహీనంగా ఉన్న విద్యార్థులకు సాయాన్ని అందజేసేందుకు ఓ కొత్త పథకాన్ని కూడా తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇక విద్యార్థులు తరగతులకు వెళ్లే సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.

గత కొద్ది రోజులుగా ఫీజుల పెంపును నిరసిస్తూ విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళనలను నిర్వహించారు. ఫీజులను ఇష్టారాజ్యంగా పెంచితే పేద విద్యార్థులు ఎలా చదువుతారని ప్రశ్నించారు. రెండు వారాలుగా విద్యార్థులు నిరసనలు చేపట్టారు.
#JNU Executive Committee announces major roll-back in the hostel fee and other stipulations. Also proposes a scheme for economic assistance to the EWS students. Time to get back to classes. @HRDMinistry
— R. Subrahmanyam (@subrahyd) November 13, 2019
రెండ్రోజుల క్రితం బారికేడ్లను తోసుకుంటూ యూనివర్సిటీ భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య తోపులాట కూడా జరిగింది. యూనివర్సిటీ ఎదుటే దీక్షలు చేపట్టారు. పలువురు జేఎన్యూ విద్యార్థి సంఘం నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications