కరోనా కేసుల్లో భారీ జంప్; 8వేలను దాటిన కొత్తకేసులు; 40వేలను దాటిన యాక్టివ్ కేసులు
భారతదేశంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా ఎనిమిది వేల పైచిలుకు కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. మే చివరి వారంలో రెండు వేల కేసులు నుండి ప్రస్తుతం ఎనిమిది వేల పైచిలుకు కేసులకు కరోనా కేసులు పెరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు . శనివారం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పిన లెక్కల ప్రకారం గత 24 గంటల్లో 8.329 కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 28 తర్వాత ఇంత పెద్ద ఎత్తున కేసులు నమోదు కావడం ఇది అత్యధికం.
ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్లు నివేదించబడుతున్నప్పుడు ఈ పెరుగుదల దేశంలో నాల్గవ వేవ్ గురించి ఆందోళనలను రేకెత్తించింది. ఇన్ఫెక్షన్లు పెరిగినప్పటికీ, ఆసుపత్రిలో చేరికలు తక్కువగా ఉన్నాయి. మరణాలు తక్కువగా నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నివేదించబడిన కేసులలో చాలా వరకు తేలికపాటివిగా ఉన్నాయి. గత 24 గంటల్లో 10 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ సంభవించిన మొత్తం మరణాల సంఖ్య 5,24,757కి చేరుకుంది.

ప్రభుత్వ డేటా ప్రకారం, 4,103 కరోనా క్రియాశీల కేసులు పెరుగుదల తర్వాత క్రియాశీల కేసుల సంఖ్య 40,000 మార్కును అధిగమించింది. మొత్తం యాక్టివ్ కేసులు ప్రస్తుతం మొత్తం 0.09 శాతంగా ఉన్నాయని డేటా చూపించింది. గత 24 గంటల్లో 4,216 మంది కరోనా మహమ్మారి బారి నుండి కోలుకోవడంతో దేశవ్యాప్తంగా రికవరీ రేటు ప్రస్తుతం 98.69 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 4,26,48,308. ఇదిలా ఉంటే రోజువారీ పాజిటివిటీ రేటు 2.41 శాతం మరియు వారంవారీ సానుకూలత రేటు 1.75 శాతం గా ఉంది.
అత్యధిక కోవిడ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. శుక్రవారం, రాష్ట్ర ఆరోగ్య శాఖ, 3,081 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో ముంబైలోనే 2,000 కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి కేసులు భారీగా నమోదవుతున్న మరో రాష్ట్రం కేరళ. కేరళ రాష్ట్రంలో గత 24 గంటల్లో 2,041 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 655 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు తాజా పెరుగుదల మధ్య దేశవ్యాప్తంగా ఆంక్షలు మరోమారు కఠినతరం అయ్యే అవకాశం ఉంది.
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications