వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా భార్య ఎవరితోనో లేచిపోయింది: అనుమానంతో చంపేసి

|
Google Oneindia TeluguNews

జైపూర్: భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానంతో ఆమెను దారుణంగా హత్య చేసి ఊరికి దూరంగా ఆమెను పాతిపెట్టాడు. తరువాత తన భార్య ఎవరితోనో వెళ్లిపోయిందని నమ్మించిన వ్యక్తిని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు.

రాజస్టాన్ లోని జాంజును జిల్లా, నావల్ ఘడ్ పట్టణంలో ప్రదీప్ (27), నిర్మలాదేవి (22) దంపతులు నివాసం ఉంటున్నారు. నిర్మలాదేవి ప్రవర్తనపై ప్రదీప్ అనుమానం పెంచుకున్నాడు. బయటకు వెళ్లినట్లు నటిస్తూ దూరంగా ఉంటూ భార్య ఏం చేస్తుందని పరిశీలించేవాడు.

నిర్మలాదేవి ప్రవర్తనపై ప్రదీప్ రోజురోజుకు అనుమానం పెంచుకున్నాడు. చివరికి ఆమెను చంపేస్తే ఓపని అయిపోంతుంది అనుకున్నాడు. ఇటీవల ఇంటిలోనే నిర్మలాదేవితో గొడవపడ్డాడు. తరువాత ఆమెను దారుణంగా చంపేశాడు.

Husband murders wife suspecting her character in Rajasthan

ఎవ్వరికి అనుమానం రాకుండా ఊరికి 25 కిలోమీటర్ల దూరంలోని నిర్జనప్రదేశంలో నిర్మలాదేవి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. తరువాత నాభార్య ఎవరితోనో లేచిపోయిందని అందరిని నమ్మించాడు.

నా కుమార్తె కనపడటం లేదని నిర్మలాదేవి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ప్రదీప్ మీద అనుమానం రావడంతో అతనిని అదుపులోకి తీసుకుని విచారించారు. చివరికి నేరం చేసినట్లు ప్రదీప్ అంగీకరించాడు. నిర్మలాదేవి మృతదేహాన్ని పూడ్చి పెట్టిన ప్రాంతం గుర్తించిన పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టుంకు తరలించారు.

English summary
Pradeep Kumar (27 allegedly killed his wife Nirmala Devi (22) and buried her body far from his house in Navalgarh town of this district suspecting her character.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X