Illegal affair: 8వ అంతస్తు బాల్కనీలో భార్య, సైలెంట్ గా తోసి చంపేసిన భర్త, చెల్లెలు అని !
లక్నో: కుటుంబ సభ్యులు చూపించిన యువతిని వివాహం చేసుకున్న వ్యక్తి ఆమెతో సంతోషంగా కాపురం చేశాడు. దంపతులకు కూతురు, కుమారుడు ఉన్నారు. ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న భర్త మంచి జీతం తీసుకుంటున్నాడు. సిటీలోని విలాసవంతమైన అపార్ట్ మెంట్ 8వ అంతస్తులో దంపతులు వారి పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. భర్త ప్రతినెల ఎక్కువగా ఆఫీసు పనిమీద క్యాంపులు వెలుతున్నాడు. అయితే అక్రమ సంబంధం విషయంలో దంపతుల మద్య ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. క్యాంపు నుంచి భర్త ఇంటికి వెళ్లాడు. తరువాత దంపతుల మద్య ఇదే విషయంలో పెద్ద గొడవ జరిగింది. ఇద్దరు పిల్లలను బెడ్ రూమ్ లోకి పంపించిన భర్త అతని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. కొంత సేపటికి 8వ అంతస్తులోని బాల్కనీలో నిలబడి ఉన్న భార్యను ఆమె భర్త కిందకు తోసేశాడు. 8వ అంతస్తు నుంచి కిందపడిన భార్య ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
హ్యాపీలైఫ్.... ఇద్దరు పిల్లలు
ఉత్తరప్రదేశ్ లోని లక్నోలోని గోసాయి గంజ్ ప్రాంతంలో సంజీవ్ కుమార్ (36) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు చూపించిన నీతు (32) అనే యువతిని 2011లో వివాహం చేసుకున్న సంజీవ్ కుమార్ భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. సంజీవ్ కుమార్, నీతు దంపతులకు కూతురు (7, కుమారుడు (5) ఉన్నారు.
ప్రముఖ కంపెనీలో ఉద్యోగం
ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సంజీవ్ కుమార్ మంచి జీతం తీసుకుంటున్నాడు. లక్నోలోని గోసాయి గంజ్ ఏరియాలోని విలాసవంతమైన అపార్ట్ మెంట్ 8వ అంతస్తులో సంజీవ్ కుమార్, నీతు దంపతులు వారి ఇద్దరి పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. సంజీవ్ కుమార్, నీతూ దంపతుల పిల్లలు చదువుకుంటున్నారు.
క్యాంపుకు వెలుతున్నానని ఎంజాయ్
సంజీవ్ కుమార్ ప్రతినెల ఎక్కువగా ఆఫీసు పనిమీద క్యాంపులు వెలుతున్నాడు. అయితే ఆఫీసు పని ఉందని చెప్పి బయట తిరుగుతున్న సంజీవ్ కుమార్ ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడని తెలిసింది. చాలాకాలం నుంచి సంజీవ్ కుమార్ కు ఆమెతో సీక్రేట్ గా అక్రమ సంబంధం సాగిస్తున్నాడని తెలిసింది.
చెల్లెలు అని పరిచయం చేసిన భర్త
అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను ఇంటికి పిలుచుకుని వెలుతున్న సంజీవ్ కుమార్ ఈమె నాకు చెల్లెలు అవుతుందని నీతూకు పరిచయం చేశాడని తెలిసింది. కొంతకాలం తరువాత తన భర్త సంజీవ్ కుమార్ ఆమె చెల్లెలిగా చెప్పుకుంటున్న మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, ఆమె నా భర్తకు చెల్లెలు కాదని నీతూ తెలుసుకుంది.
ఇంట్లో రచ్చరచ్చ అయ్యింది
అక్రమ సంబంధం విషయంలో సంజీవ్ కుమార్, నీతూ దంపతుల మద్య ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. రెండు నెలల పాటు క్యాంపుకు వెళ్లిన సంజీవ్ కుమార్ గత ఆదివారం ఇంటికి వెళ్లాడు. తరువాత ఇన్ని రోజులు ఎక్కడుకు వెళ్లావు అంటూ నీతూ ఆమె భర్త సంజీవ్ కుమార్ ను ప్రశ్నించింది. ఆ సమయంలో సంజీవ్ కుమార్, నీతూ దంపతుల మద్య ఇదే విషయంలో పెద్ద గొడవ జరిగింది.
బాల్కనీలో నుంచి భార్యను తోసి చంపేసిన భర్త
గొడవ పెద్దది కావడంతో ఇద్దరు పిల్లలను బెడ్ రూమ్ లోకి పంపించిన సంజీవ్ కుమార్ అతని భార్య నితూతో పెద్దగా గొడవ పెట్టుకున్నాడు. నేను ఎక్కడికైనా వెలుతాను ?, ఐమైనా చేస్తాను అంటూ సంజీవ్ కుమార్ రెచ్చిపోయాడు. కొంత సేపటికి 8వ అంతస్తులోని బాల్కనీలో నిలబడి ఉన్న భార్య నీతూ ను ఆమె భర్త సంజీవ్ కుమార్ కిందకు తోసేశాడు. 8వ అంతస్తు నుంచి కిందపడిన నీతూకు తీవ్రగాయాలై ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
కేసు పెట్టిన బావమరిది
విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. తన భార్య నీతూ ప్రమాదవశాత్తు కిందపడిపోయి చనిపోయిందని సంజీవ్ కుమార్ పోలీసులకు చెప్పాడు. నీతూ సోదరుడు రాజ్ కిరణ్ అతని బావ సంజీవ్ కుమార్ మీద కేసు పెట్టాడు. తన బావ సంజీవ్ కుమార్ కు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందని, ఇదే విషయంలో తన సోదరి నీతూతో గొడవ పడుతున్నాడని, అతనే మా సోదరిని చంపేశాడని రాజ్ కిరణ్ పోలీసు కేసు పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు అక్రమ సంబంధం మోజులో భార్యను 8వ అంతస్తు బాల్కనీలో నుంచి నీతూను కిందకు తోసి చంపేసిన సంజీవ్ కుమార్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.