300 అడుగుల లోయలో శవమై కనిపించిన ఇన్పోసిస్ లేడీ టెక్కి , ఏం జరిగిందంటే?
పూణే: ఉల్లాసంగా సాటి స్నేహితులు, సాటి ఉద్యోగులతో కలిసి ట్రెక్కింగ్ వెళ్లిన లేడీ టెక్కి చివరికి 300 అడుగుల కొండ లోయలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది. తెలంగాణలోని హైదారాబాద్ కు చెందిన అలిజా రాణా (23) అనే యువతి అనుమానాస్పద స్థితిలో మరణించిందని పూణే సమీపంలోని లూనావాలా పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ కు చెందిన అలిజా రాణా పూణేలోని హింజేవాడి ఐటీ పార్క్ లోని ఇన్పోసిస్ లో సాఫ్టేవేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నది. అలిజా రాణా 32 మందితో కలిసి సెప్టెంబర్ 12వ తేదీ లోనావాలా లయన్స్ పాయింట్ దగ్గరకు చేరుకుంది. ఆ రోజు అందరితో కలిసి అలిజా రాణా ఒక్కసారిగా కనపడకుండాపోయింది.

శివదుర్గ మిత్ర ట్రెక్కింగ్ గ్రూప్ కు చెందిన 35 మంది ట్రక్కర్ల సహాయంతో లయన్స్ పాయింట్ నుంచి అలిజా రాణా కోసం గాలించారు. కొంత దూరంలో అలిజా రాణా బ్యాగ్ ను సాటి ట్రక్కర్లు గుర్తించారు. విపరీతమైన వానలు, మంచు కారణంగా సహాయక చర్యలకు అంతరాయం ఎర్పడింది.
చివరికి 90 గంటల తరువాత రాహుల్ దేశ్ ముఖ్, ప్రణయ్ అంబోరె అనే ఇద్దరు యువకులకు తాళ్లు కట్టి వాకీటాకీ సహాయంతో 300 అడుగుల లోయలోకి వారిని దింపారు. ఆ లోయలో గాలించగా అలిజా రాణా శవమై కనిపించింది. మూడు గంటలకు పైగా శ్రమించి అలిజా రాణా మృతదేహం కొండ పైకి తీసుకువచ్చారు.
మొదట పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. తరువాత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అలిజా రాణా కాలుజారి కొండ మీద నుంచి లోయలోకి పడిపోయిందా ? ఆత్మహత్య ఏమైనా చేసుకుందా ? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అలిజా కుటుంబ సభ్యులు, ఆమె స్నేహితులు తెలిపిన వివరాల ఆధారంగా కేసు విచారణ చేస్తున్నామని లోనావాలా పోలీసులు తెలిపారు.
-
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications