యూ టర్న్: ఎందుకలా అంటానని సాక్షి ట్విస్ట్
న్యూఢిల్లీ: ప్రభుత్వాన్ని కూల్చే సత్తా తనకు ఉందని సంచలన వ్యాఖ్యలు చేసిన బిజెపి పార్లమెంటు సభ్యుడు సాక్షి మహరాజ్ మాట మార్చారు. ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసలతో ముంచెత్తారు. సమ్మిళిత అభివృద్ధి రాజకీయాలను మోడీ నడిపిస్తున్నారని ఆయన అన్నారు. మోడీని దైవశక్తిగా అభివర్ణించారు.
తన వివాదాస్పద వ్యాఖ్యలకు షోకాజ్ నోటీసును అందుకున్న సాక్షి మహరాజ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో మోడీ ఒక చేత్తో అభివృద్ధి ఎజెండాను, మరో చేత్తో హిందూత్వ ఎజెండాను ముందుకు తీసుకుని వెళ్లాలని ఆయన అన్నటువంటి విషయం తెలసిందే. తాను తలుచుకుంటే ప్రభుత్వాన్ని కూల్చగలనని కూడా అన్నారు.

బుధవారంనాడు ఆయన కొత్త పాట వినిపించారు. ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించినందున అయోధ్యలో రామాలయ నిర్మాణానికి వేచి చూడవచ్చునని అన్నారు. అయోధ్యలో మోడీతో పాటు ప్రతి ఒక్కరూ రామాలయాన్ని నిర్మించాలని కోరుకుంటున్నారని ఇంతకు ముందు అన్నారు.
ప్రభుత్వాన్ని తాను హెచ్చరించినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తన మాటలను మీడియా వక్రీకరించిందని అంటూ తాను మోడీ సైనికుడినని, అభిమానిని అని చెప్పుకున్నారు. అటువంటప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలననీ, కూల్చగలనని తాను ఎలా అంటానని ప్రశ్నించారు. మూర్ఖుడు కూడా అలా మాట్లాడబోరని అన్నారు. మోడీ భారత దేశం దైవ శక్తి అని, మోడీ సామాన్యమానవుడు కారని, దైవశక్తి అని అన్నారు.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications