మోడీ అభిమానిని, ప్రచారం అవసరం లేదు: ప్రీతిజింటా
ముంబై: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ అంటే తనకు అభిమానమని ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతిజింటా అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో నరేంద్ర మోడీ ఘన విజయం సాధిస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీకి ప్రచారం చేయాల్సిన అవసరం లేదన్నారు. తాను కేవలం దేవుడి దర్శనానికి వచ్చానని చెప్పారు.
పలువురు బాలీవుడ్ ప్రముఖులు నరేంద్ర మోడీ పైన ప్రశంసల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఆయనకు చాలామంది బాలీవుడ్ ప్రముఖులు మద్దతు పలుకుతున్నారు. ఇటీవల మోడీ విషయంలో బాలీవుడ్లో విభేదాలు కనిపించాయి.

లౌకికవాదానికి మద్దతివ్వాలని పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఇటీవల ఓటర్లను కోరారు. దీంతో మోడీకి మద్దతిచ్చే మరికొందరు బయటకు వచ్చి... లౌకికవాదం పేరుతో కొందరు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ మోడీకే తమ మద్దతు అని ప్రకటించారు.
మోడీకి బాలీవుడ్ ప్రముఖులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా పలువురు మద్దతు పలికిన విషయం తెలిసిందే. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, రాజశేఖర్ వంటి వారు మద్దతు పలికారు. ఇక నాగార్జున ఆయనను గుజరాత్ వెళ్లి కలిసి వచ్చారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications