ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై విచారణకు డిమాండ్, బిజెపి ఎలా గెలిచింది: హర్ధిక్ పటేల్
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలో ఈవీఎంల ట్యాంపరింగ్పై దర్యాప్తు చేయించాలని ప్రతిపక్ష నేతలందరికీ లేఖలు రాస్తాను. అలాగే బ్యాలెట్ పేపర్తోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తానని పటీదార్ల ఉద్యమ నాయకుడు హర్ధిక్ పటేల్ చెప్పారు.
గుజరాత్ రాష్ట్రంలో బిజెపి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి విజయం సాధించిందని హర్ధిక్ పటేల్ ఆరోపించారు. బిజెపి గుజరాత్ రాష్ట్రంలో ఓటమి పాలు కావాల్సి ఉండేదని కానీ, ఆ పార్టీ మాత్రం ఈవీఎంల ట్యాంపరింగ్ చేసి విజయం సాధించిందని ఆయన ఆరోపించారు.
అయితే కాంగ్రెస్ పార్టీ గుజరాత్ రాష్ట్రంలో బలం పుంజుకొందని చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన కొన్ని స్థానాలను ఈవీఎంల ల్యాంపరింగ్ ద్వారా బిజెపి గెలుచుకొందని ఆయన ఆరోపణలు గుప్పించారు.

ఈవీఎంల ట్యాంపరింగ్పై దర్యాప్తు చేయించాలి
ఈవీఎంల ట్యాంపరింగ్పై దర్యాప్తు చేయించాలని ప్రతిపక్ష నేతలందరికీ లేఖలు రాస్తాను. అలాగే బ్యాలెట్ పేపర్తోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తానని హర్ధిక్ పటేల్ చెప్పారు.ఈవీఎంల ట్యాంపరింగ్ చేయకపోతే బిజెపి విజయం సాధించేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయమై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మరో వైపు బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలను నిర్వహించాలని హర్దిక్ పటేల్ డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ఓట్ల శాతం
కాంగ్రెస్ పార్టీకి గతంలో 33శాతం ఓట్ల శాతం ఉండేదని అది ఇప్పుడు 43శాతానికి పెరిగిందన్నారు. బిజెపి ఈవీఎంల ట్యాంపరింగ్కు పాల్పడకపోతే మరో 12 నుంచి 13 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చేవని హర్ధిక్ పటేల్ అభిప్రాయపడ్డారు. అయితే బిజెపి మోసం కారణంగానే ఈ సీట్లు రాలేదని హర్దిక్ ఆరోపించారు.

అందరూ వ్యతిరేకించిన బిజెపి ఎలా గెలిచింది
వాస్తవానికి బీజేపీకి 82 సీట్లు మాత్రమే రావాలి. వారిని పటేళ్లు, ఓబీసీలు, దళితులు, వ్యాపారులు వ్యతిరేకించారు. అలాంటప్పుడు ఇంకెవరు వారిని నమ్మి ఓటు వేస్తారని హర్ధిక్ పటేల్ అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరగకపోతే బిజెపికి ఈ విజయం దక్కకపోయేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎటీఎంల హ్యకింగ్ ఈవీఎంలు ఓ లెక్కా
ఏటీఎంలనే హ్యాకింగ్ చేస్తున్నారు, ఈవీఎంలను హ్యక్ చేయడం సాధ్యమేనని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ భవిష్యత్ను నిర్ణయించేది ఈవీఎంలేనని చెప్పారు. అయితే గతంలో మాదిరిగానే బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని హర్దిక్ పటేల్ అభిప్రాయపడ్డారు.సూరత్, రాజ్కోట్, అహ్మదాబాద్లలో కచ్చితంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు' అని హార్ధిక్ అభిప్రాయపడ్డారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications