74 ఏళ్ల నవ యువకుడిని: తీహార్ జైలులో చిదంబరం పుట్టినరోజు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక, హోం శాఖల మాజీ మంత్రి పీ చిదంబరం గురువారం తీహార్ కేంద్ర కారాగారంలో తన 74వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన ఆయన ప్రస్తుతం కొద్దిరోజులుగా తీహార్ జైలులో విచరణను ఎదుర్కొంటున్నారు. ఈ నెల 19వ తేదీ వరకు ఆయన కస్టడీ కొనసాగుతుంది. జన్మదినం సందర్భంగా చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం, ఇతర కుటుంబ సభ్యులు ఈ ఉదయం తీహార్ జైలులో ఆయనను కలుసుకున్నారు. దేశ ఆర్థిక స్థితిగతులపై తాను రాసిన రెండు పేజీల లేఖను చిదంబరానికిక అందజేశారు. చిదంబరానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు, కేంద్ర మాజీమంత్రులు జైరామ్ రమేష్, శశిథరూర్ ట్వీట్ల ద్వారా ఆయనకు గ్రీటింగ్స్ చెప్పారు. చిదంబరం ప్రస్తుతం అగ్నిపరీక్ష వంటి కాలాన్ని ఎదుర్కొంటున్నారని, త్వరలోనే దీన్ని అధిగమిస్తారని చెప్పారు.
I have asked my family to tweet on my behalf the following:
— P. Chidambaram (@PChidambaram_IN) September 16, 2019
My family have brought me greetings from friends, party colleagues and well-wishers. I am reminded that I am 74 years old. Indeed I am but at heart I feel 74 years young. Thank you all, my spirits have been lifted higher
ఆలోచనలన్నీ ఆర్థిక వ్యవస్థ చుట్టే..
పుట్టినరోజు సందర్భంగా చిదంబరం తరఫున ఆయన కుటుంబ సభ్యులు ఈ ఉదయం వరుసగా ట్వీట్లను సంధించారు. 74 సంవత్సరాల నవ యువకుడిగా మారిపోయానని అన్నారు. అదే ఉత్సాహంతో తాను ఎన్డీఏ ప్రభుత్వం ఆర్థిక విధానాలపై పోరాటం సాగిస్తానని చెప్పారు. పార్టీ నాయకులు, స్నేహితులు, బంధుమిత్రులు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారని, ప్రతిగా తాను వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు చిదంబరం చెప్పారు. వయస్సు రీత్యా 74 సంవత్సరాలు నిండినప్పటికీ..మనస్సు రీత్యా తాను నవ యువకుడిగా ఆలోచిస్తున్నాయని అన్నారు. దేశ ఆర్థిక విధానాల చుట్టే తన ఆలోచనలు తిరుగుతున్నాయని చిదంబరం పేర్కొన్నారు. ఒక్క ఆగస్టులోనే దేశ ఎగుమతుల శాతం -6.05గా నమోదైందని, దీన్నిబట్టి ఆర్థిక వ్యవస్థ ఎలాంటి దారుణ స్థితికి చేరుకుందో తెలుస్తోందని అన్నారు.
My thoughts today are about the economy. Just one statistic tells the story. Export growth in August was -6.05%.
— P. Chidambaram (@PChidambaram_IN) September 16, 2019
No country has achieved GDP growth of 8% without exports growing at 20% a year.
ఈ దేశాన్ని ఆ దేవుడే కాపాడాలి..
ఓ ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల శాతం కనీసం 20 శాతాన్ని చేరుకుంటేనే ఏ దేశమైనా పురోగమిస్తుందని చెప్పారు. దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఎనిమిది శాతానికి చేరుకోవాలంటే.. ఎగుమతులు 20 శాతం మేర నమోదు కావాల్సి ఉంటుందని అన్నారు. ఆగస్టులో నమోదైన ఎగుమతుల శాతం మైనస్ లోకి వెళ్లిపోవడం ప్రమాద ఘంటికలను మోగిస్తోందని, ప్రమాదకర సంకేతాలను పంపించిందని చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థికంగా ఇలాంటి స్థితికి జారిపోయిన భారత్ ను ఆ దేవుడే కాపాడాలని అన్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఓ దఫా కస్టడీ ముగిసినప్పటికీ.. దీన్ని పొడిగించాలంటూ సీబీఐ చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ న్యాయస్థానం అంగీకరించింది. ఈ నెల 19వ తేదీ వరకు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలను జారీ చేసింది. విచారణ సందర్భంగా చిదంబరాన్ని తీహార్ జైలులోని ఏడో నంబర్ కారాగార కాంప్లెక్స్ లో ఉంచారు. అక్కడే ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు.
May God bless this country.
— P. Chidambaram (@PChidambaram_IN) September 16, 2019
Many happy returns of the day @PChidambaram_IN. There will be happier birthdays, I’m sure. Terrific letter, Karti. We stand with you in your quest for justice. #HBDPChidambaram https://t.co/nBIMpKC8PP
— Shashi Tharoor (@ShashiTharoor) September 16, 2019
Today PC turns 74. It is an agnipariksha he is going through but he will come out of it vindicated. I have worked very closely with him since 1986 and it has been a great privilege and education doing so. My thoughts are with him.#PChidambaram
— Jairam Ramesh (@Jairam_Ramesh) September 16, 2019