వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నో అనుభూతులు: సునందపై థరూర్, పోలీసులపై...

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తాను సునంద పుష్కర్‌ను చాలా మిస్ అవుతున్నానని, తనకు ఎన్నో అనుభూతులను మిగిల్చి ఆమె వెళ్లిపోయిందని కేంద్రమంత్రి శశి థరూర్ ఆదివారం అన్నారు. ఓ న్యూస్ ఛానల్‌తో ఆయన మాట్లాడారు. అదే సమయంలో పోలీసుల దర్యాఫ్తును ఆయన తప్పు పట్టారు.

సునంద పుష్కర్ మృతి కేసులో ఢిల్లీ పోలీసుల దర్యాఫ్తు వేగవంతంగా లేదని శశి థరూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె ఆరోగ్య సంబంధితం కారణాలతోనే మృతి చెందినట్లుగా స్పష్టమవుతోందని చెప్పారు.

I miss Sunanda, she has left me with wonderful memories

కేసును పొడిగించడానికి ఎలాంటి కారణాలు లేవని ఆయన అన్నారు. సునంద మృతి చెంది అయిదు వారాలు అవుతున్నా అర్థం పర్థం లేని ఊహలతో కేసును సాగదిస్తూ ముగించడం లేదన్నారు. తనపై వ్యక్తిగతంగా కేసు ఏమీ లేకున్నా పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నానని తెలిపారు.

ఢిల్లీ పోలీసుల దర్యాఫ్తుపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. పోలీసులు ఎఫ్ఐఆర్, అభియోగ పత్రం నమోదు చేయలేదని, కేసును ఇంకా పొడిగించడానికి ఎలాంటి కారణాలు లేవన్నారు.

ఈ విషయంలో సునంద తనయుడు, తండ్రి, సోదరుడు అందరు తనకు అండగా ఉన్నారని చెప్పారు. ఇందులో ఎలాంటి కుట్ర కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. తాను ఆమెను ప్రతి క్షణం మిస్ అయ్యానని, తనకు ఆమె ఎన్నో అనుభూతులను మిగిల్చిందన్నారు.

English summary
Congress leader Shashi Tharoor said on Sunday that he missed his wife Sunanda Pushkar a lot and that they had shared an intense relationship during the four years that they were together.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X