Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మళ్లీ వస్తా- ఇదే ఎర్రకోట నుంచి ప్రసంగిస్తా: వచ్చే అయిదేళ్లూ మావే: మోదీ ధీమా..!!

న్యూఢిల్లీ: యావత్ దేశం 77వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకొంటోంది. దేశం మొత్తం త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతోంది. నేషన్ ఫస్ట్- ఆల్వేస్ ఫస్ట్.. అనే థీమ్‌తో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకోనున్నారు దేశ ప్రజలందరూ. జాతీయ సమగ్రత, దేశాభివృద్ధికి సంకేతంగా ఈ థీమ్‌ను రూపొందించింది ప్రభుత్వం.

పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రాజధానిలోని ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. జనాభా, అతిపెద్ద ప్రజాస్వామ్యం, వైవిధ్యం.. అనే ఈ మూడు అంశాలకు దేశ ప్రజల కలలను సాకారం చేసే శక్తి ఉందని మోదీ చెప్పారు.

I will present before you Indias achievements from this Red Fort in 2024, August 15

ఇది మోదీ ప్రభుత్వం అని, ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రతీక అని మోదీ పేర్కొన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడమే కాదు.. దాన్ని అనుకున్న సమయం కంటే ముందే ఛేదించడమూ తమకు తెలుసునని అన్నారు. అలసిపోయే, ఆగిపోయే, ఓడిపోయే భారత్ కాదు.. ఇప్పుడున్నది ఆత్మనిర్భర్ భారత్ అంటూ ప్రధాని భావోద్వేగంతో చెప్పుకొచ్చారు.

విశ్వకర్మల కోసం ప్రధాని మోదీ కొత్త పథకాన్ని ప్రకటించారు. సంప్రదాయ చేతివృత్తుల వారిని ఆదుకోవడానికి, ఆర్థికంగా బలోపేతం చేయడానికి, వారికి మెరుగైన జీవనాన్ని కల్పించడానికి, ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించడానికి దీన్ని ప్రారంభించబోతోన్నామని అన్నారు.

13,000 నుంచి 15,000 కోట్ల రూపాయలతో వచ్చే నెలలోనే ఈ పథకానికి శ్రీకారం చుట్టబోతోన్నామని ప్రధాని మోదీ చెప్పారు. సెప్టెంబర్ 17వ తేదీన విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలకు ఆర్థిక సాధికారతను కల్పిస్తామని అన్నారు.

వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీన జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లోనూ తానే ప్రసంగిస్తానంటూ మోదీ ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ జాతీయ పతాకాన్ని ఎగురవేస్తానని తేల్చి చెప్పారు. దేశం ఇంకా సుదీర్ఘ ప్రయాణాన్ని సాగించాల్సి ఉందని, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడానికి వచ్చే అయిదేళ్ల కాలం అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు.

2014లో ఏర్పడిన తమ ప్రభుత్వ పనితీరును చూసి 2019లో దేశ ప్రజలను తనను మరోసారి ఆశీర్వదించారని, ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని గుర్తు చేశారు. వచ్చే అయిదేళ్లల్లో అద్భుత ప్రగతిని సాధించాల్సి ఉందని పేర్కొన్నారు. 2047 కలను సాకారం చేసుకోవడానికి వచ్చే అయిదేళ్లే అత్యంత కీలకమని, అవి బంగారు క్షణాలని మోదీ చెప్పారు. 2024 ఆగస్టు 15వ తేదీన ఇదే ఎర్రకోట నుంచి దేశ విజయాలు, అభివృద్ధిని మీ ముందు ఉంచుతానని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+