ఐఏఎస్ డికే. రవి కేసు: హై కోర్టులో అర్జీ కొట్టివేత
బెంగళూరు: ఐఏఎస్ అధికారి డికే. రవి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు విషయాలను బహిరంగం చెయ్యారాదని మహిళ ఐఏఎస్ అధికారి భర్త సుధీర్ రెడ్డి వేసిన పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. దర్యాప్తులోని ఎలాంటి విషయాలను బహిరంగం చేయబోమని ప్రభుత్వం న్యాయస్థానం ముందు చెప్పింది
మహిళ ఐఏఎస్ అధికారి భర్త సుధీర్ రెడ్డి వేసిన పిటిషన్ (అర్జీ)ను గురువారం హై కోర్టు న్యాయమూర్తి ఎస్. అబ్దుల్ నజీర్ విచారణ చేశారు. ఆ సమయంలో డికే రవి కేసుకు సంబంధించి ఎలాంటి వివరాలను ప్రభుత్వం బహిరంగం చెయ్యదని అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎ.ఎస్. పోన్నణ్ణ న్యాయమూర్తికి చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారి డికే రవి కేసు దర్యాప్తును ఇప్పటికే సీబీఐకి అప్పగించిందని న్యాయస్థానం ముందు చెప్పారు. సీఐడి అధికారులు దర్యాప్తు చేసిన నివేదిక, ఆధారాలు మొత్తం సీబీఐకి అప్పగించారని అన్నారు. సీఐడి అధికారులు దర్యాప్తు చేసిన వివరాలు ఎలాంటి పరిస్థితిలో బయటపెట్టమని అన్నారు.

అంగీకరించిన సుధీర్ రెడ్డి....................!
ప్రభుత్వం కేసు దర్యాప్తు వివరాలను బయటపెట్టమని చెబుతున్న సమయంలో అర్జీ విచారణ చెయ్యడం భావ్యం కాదని హైకోర్టు న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ అన్నారు. అర్జీ సమర్పించిన సుధీర్ రెడ్డి, ఆయన న్యాయవాది సజ్జన్ పూవయ్య మాట్లాడుతూ ప్రభుత్వం దర్యాప్తు వివరాలు బయట పెట్టమని చెబుతున్నారని, అర్జి కొట్టి వెయ్యడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు.
ఐఏఎస్ అధికారి డికే. రవి అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన తరువాత సీఐడి అధికారులు దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేస్తున్న వివరాలను బహిరంగం చేస్తే మహిళ ఐఏఎస్ అధికారికి, తమ కుటుంబానికి జరగరాని నష్టం జరుగుతుందని సుధీర్ రెడ్డి హై కోర్టులో అర్జీ సమర్పించారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications