జైల్లో శశికళ లగ్జరీ లైఫ్, చిక్కుల్లో చిన్నమ్మ ఫ్యామిలీ, బ్యాంకు అకౌంట్లు, ఎవరు ఆ నటుడు ?
అక్రమాస్తుల కేసులో శిక్షకు గురైన శశికళ బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో లగ్జరీ లైఫ్ గడుపుతూ దేశ ప్రజలకే పెద్ద షాక్ ఇచ్చిన విషయం తెలిసింది.
బెంగళూరు/చెన్నై: అక్రమాస్తుల కేసులో శిక్షకు గురైన శశికళ బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో లగ్జరీ లైఫ్ గడుపుతూ దేశ ప్రజలకే పెద్ద షాక్ ఇచ్చిన విషయం తెలిసింది. జైల్లో శశికళకు రాచమర్యాదలు చేయించిన ఆమె బంధువులను విచారణ చెయ్యాలని అధికారులు సిద్దం అయ్యారు.
శశికళ బంధవులను బెంగళూరుకు పిలిపిస్తే రారని, మాయమాటలు చెబుతారని పసిగట్టిన అధికారులు తామే చెన్నై వెళ్లాలని నిర్ణయించారు. చెన్నై వెళ్లి శశికళ బంధవులు, అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) వర్గంలోని కొందరు నాయకులు, మన్నార్ గుడి మాఫియా సభ్వులను విచారణ చెయ్యడానికి రంగం సిద్దం అయ్యింది.

శశికళ కుటుంబీకుల మెడకు ?
పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళ లగ్జరీ జీవితం వ్యవహారం ఆమె కుటుంబికుల మెడకు చుట్టుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శశికళ కుటుంబాన్ని టార్గెట్ చేసి విచారణ చేసేకుందుకు రిటైడ్ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం సిద్దం అయ్యింది.
Recommended Video


చిన్నమ్మ ఫ్యామిలీ మీద
శశికళ జైలుకు వెళ్లిన తరువాత ఆమె సోదరి వణితామణి కుమారుడు టీటీవీ దినకరన్ జైల్లో శశికళను కలుస్తున్న విషయం అధికారికంగా బయటకు వస్తున్నది. అయితే ఆమె కుటుంబ సభ్యులు (మన్నార్ గుడి ఫ్యామిలీ) మాత్రం చాపకింద నీరులా బెంగళూరు చేరుకుని చిన్నమ్మతో ములాఖత్ అవుతున్నారు.

అధికారం కోసం ఆరాటం
అన్నాడీఎంకే పార్టీ మీద పట్టుకోసం టీటీవీ దినకరన్ ప్రయత్నిస్తున్నాడు. శశికళ సోదరుడు దివాకరన్ కూడా తెర వెనుక రాజకీయాలు చేస్తున్నాడు. ఇక చిన్నమ్మ భర్త నటరాజన్ సుప్రీం కోర్టులో పునస్సమీక్షా పటిషన్ వేసి శశికళను జైల్లో నుంచి బయటకు తీసుకురావాలని చాపకింద నీరులా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎవరు ఆ ఎమ్మెల్యే ?
అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) వర్గంలోని ఓ ఎమ్మెల్యే కన్నడ చిత్రపరిశ్రమకు చెందిన ఓ హాస్యనటుడి సహాయంతో పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు లగ్జరీ లైఫ్ గడిపే విదంగా వ్యవహారం నడిపించాడని మాజీ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ బృందం గుర్తించిందని తెలిసింది.

ప్రైవేటు బ్యాంకులో
ఓ ప్రైవేట్ బ్యాంకులో శశికళ కుటుంబ సభ్యులు భారీ మొత్తంలో నగదు డ్రా చేశారని దర్యాప్తు చేస్తున్న మాజీ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ నేతృత్వంలోని 25 మంది అధికారుల బృందం గుర్తించింది. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ? అని ఆరా తీస్తున్నారు.

లంచం బ్యాంకులో డిపాజిట్ చేశారా ?
శశికళ లగ్జరీ లైఫ్ గడపడానికి కర్ణాటక జైళ్ల శాఖ అధికారులకు రూ. 2 కోట్లు లంచం ఇచ్చారని డీఐజీ రూప ఆరోపించారు. డీఐజీ రూప చేసిన ఆరోపణలతో శశికళ కుటుంబ సభ్యులకు ఆ రూ. 2 కోట్లు ఎలా వచ్చాయి ? అధికారుల బ్యాంక్ అకౌంట్ లో జమ చేశారా ? నేరుగా ఇచ్చారా ? అని ఆరా తీయ్యాలని అధికారులు నిర్ణయించారు.

హడలిపోతున్నారు
వినయ్ కుమార్ నేతృత్వంలోని 25 మంది అధికారులు చెన్నై వస్తున్నారని సమాచారం బయటకు రావడంతో అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే, ఆపార్టీలోని కొందరు నాయకులు, శశికళ ఫ్యామిలీ సభ్యులు హడలిపోతున్నారని తమిళ మీడియా వార్తలు ప్రసారం చేస్తోంది. మొత్తం మీద శశికళ దెబ్బతో జైల్లో ఆమెతో భేటీ అయిన అందరికీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని సమాచారం.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications