వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హద్దు మీరితే సహించేది లేదు: కేరళ ఐఏఎస్ లకు సీఎం వార్నింగ్!
కేరళ ఐఏఎస్ అధికారులంతా సామూహికంగా సెలవులు పెట్టాలని తీసుకున్న నిర్ణయంపై సీఎం విజయన్ మండిపడ్డారు.
తిరువనంతపురం: కేరళ ఐఏఎస్ అధికారులను ఆ రాష్ట్ర సీఎం పినరై విజయన్ కాస్త గట్టిగానే మందలించారు. ఐఏఎస్ అధికారులపై ప్రభుత్వ నిఘా, కేసులు పెరిగిపోయిన నేపథ్యంలో.. వారంతా సామూహికంగా సెలవులు పెట్టాలని శనివారం నాడు నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో సీఎం పినరై విజయన్ దీనిపై సోమవారం 8 మంది ఉన్నత ఐఏఎస్ అధికారులతో సమావేశమయ్యారు. ఐఏఎస్ ల మూకుమ్మడి సెలవుల నిర్ణయంపై సమావేశంలో ఆయన మండిపడ్డారు. హద్దు మీరితే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. అయితే గత ప్రభుత్వ హయాంలో నియమితులైన తమపై ఇప్పటి ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఐఏఎస్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Comments
English summary
IAS officers in Kerala who had decided to go on a mass casual leave in protest decided to withdraw their protest following a meeting with Chief Minister Pinarayi Vijayan.
Story first published: Monday, January 9, 2017, 18:11 [IST]