Jammu Kashmir: ఎల్ఓసీ సమీపంలో ఐఈడీ పేలుడు.. ఇద్దరు సైనికులు మృతి
Jammu Kashmir: జమ్మూ కశ్మీర్ లోని ఎల్ఓసీ సమీపంలో జరిగిన ఐఈడీ పేలుడులో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. ఒకరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో జమ్మూ జిల్లాలోని ఖౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలసోని కేరీ బత్తల్ ప్రాంతంలోని ఎల్వోసీ సమీపంలో ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు గాయపడగా.. వారిని ఆర్మీ ఆస్పత్రిలో చేర్చారు. వీరిలో ఇద్దరు చికిత్స సమయంలో మరణించగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
ఉగ్రవాదుల కోసం గాలింపు..
అధికారుల ప్రకారం.. అఖ్నూర్ సెక్టార్ లోని నియంత్రణ లేఖ దగ్గ ఆర్మీ బృందం గస్తీ కాస్తోంది. ఆ సమయంలో ఉగ్రవాదులు ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే ఆదనపు ఆర్మీ దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిని సైనికులను ఆస్పత్రికి తరలించిన తర్వాత ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను ప్రారంభించారు. పేలుడుకు సంబంధించిన విషయాలపై ఆరా తీస్తున్నారు. ఉగ్రవాదులు అమర్చి ఉంటారని భావిస్తున్న ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్(IED)పేలడం వల్ల పేలుడు సంభవించిందని ప్రాథమిక సమాచారం వెల్లడించింది. పేలుడు జరిగిన వెంటనే ఆ ప్రాంతమంతా దిగ్బంధించబడిందని అధికారులు వెల్లడించారు.

కాల్పుల్లో సైనికుడికి గాయాలు
ఇదిలా ఉండగా.. సోమవారం రౌజౌరి జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద జరిగిన కాల్పుల్లో ఒక ఆర్మీ సైనికుడు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. నౌషెరా సెక్టార్ లోని కలాల్ ప్రాంతంలోని ఫార్వర్డ్ పోస్ట్ లో ఆ జవాన్ కు బుల్లెట్ గాయాలు కావడంతో వెంటనే ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. సోమవారం మధ్యాహ్నం 2.40 గంటల ప్రాంతంలో ఎల్వోసీ వెంబడి కాల్పులు జరిగాయి. ఫిబ్రవరి 8న కేరీ సెక్టార్ లోని నియంత్రణ రేఖ వెంబడి అడవి నుంచి వచ్చిన ఉగ్రవాదు ఆర్మీ పెట్రోలింగ్ చేస్తున్న వ్యక్తిపై కాల్పులు జరిపారు. ప్రతీకారంగా భారత దళాలు కూడా కొన్ని రౌండ్లు కాల్పులు జరిపాయి. అనంతరం ఆ ప్రాంతంలో కఠినమైన నిఘాను ఏర్పాటు చేశారు.
ఎల్ఓసీ దగ్గర దొరికిన ఆయుధాలు
కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖకు సమీపంలోని కర్నా ప్రాంతంలో సోమవారం జరిగిన సోదాల్లో భద్రతా దళాలు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. కర్నా తహసీల్ లోని బాడి మొహల్లా అమ్రోహి ప్రాంతంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉన్నట్లు సమాచారం అందడంతో సైన్యం, పోలీసుల సంయుక్త బృందం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టిందని అధికారులు వెల్లడించారు. ఆ సోదాల్లో భద్రతా దళాలు ఒక ఏకే47 రైఫిల్, ఒక ఏకే మ్యాగజైన్, ఒక సైగా ఎంకే రైఫిల్, ఒక సైగా ఎంకే మ్యాగజైన్, 12 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నాయి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications