వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం పళనిసామి బలపరిక్షలో ఓడిపోతే తమిళనాడులో ఇదే పరిస్థితి !

శశికళ వర్గంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు సీఎం ఎడప్పాడి పళనిసామికి వ్యతిరేకంగా ఓటు వేసి ఇన్ని రోజులు మమ్మలి రిసార్ట్ నిర్బంధించారని అసెంబ్లీలో చెబితే సీన్ రివర్స్ అవుతుంది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి అసెంబ్లీలో బలపరిక్షలో ఓడిపోతే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారని విశ్వసనీయంగా తెలిసింది. ఎడప్పాటి పళనిసామి శిభిరంలో 122 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని శశికళ వర్గం అంటున్నది.

శశికళ ప్లాన్ రివర్స్: జైల్లో మరో గదికి, తమిళనాడు వెళ్లాలని ! ఎందుకంటే ?శశికళ ప్లాన్ రివర్స్: జైల్లో మరో గదికి, తమిళనాడు వెళ్లాలని ! ఎందుకంటే ?

అన్నాడీఎంకే పార్టీలో ఇప్పటికే దాదాపు 40 మంది శాసన సభ్యులు తిరుగుబాటు చెయ్యడంతో వారిని బుజ్జగించారు. అయితే అసెంబ్లీలో బలపరిక్షలో వారు ఎడప్పాడి పళనిసామికి వ్యతిరేకంగా ఓటు వేసి ప్రత్యక్షంగా నిరసన వ్యక్తం చేస్తే సీన్ రివర్స్ అవుతుంది.

If CM Palanisamy faile to prove majority in Assembly !

ఇన్ని రోజులు మమ్మల్ని రిసార్ట్ లో నిర్బంధించారని అందరి ముందు అసెంబ్లీలో చెబితే మొదటికే మోసం వస్తుంది. ఈ సందర్బంలో అసెంబ్లీలో పన్నీర్ సెల్వంతో పాటు ఆయన వర్గంలోని ఎమ్మెల్యేలు, ప్రతిపక్షం వారికి అండగా నిలిచే అవకాశం ఉంది.

40 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఎవరంటే: రంగంలోకి పన్నీర్ !40 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఎవరంటే: రంగంలోకి పన్నీర్ !

ఈ సందర్బంలో డీఎంకే మద్దతుతో పన్నీర్ సెల్వం ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి అవకాశం ఉంది. అయితే తాము ఎవ్వరికీ మద్దతు ఇవ్వమని ఎడప్పాడి పళనిసామికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ఇప్పటికే డీఎంకే పార్టీ స్పష్టం చేసింది. ఎవ్వరికి పూర్తి మెజారిటీ లేకపోతే తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని తమిళ మీడియా కోడైకూస్తోంది.

English summary
If Chief Minister Edappadi Palanisamy faile to prove majority in Assembly, possible to impose President's Rule in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X