శశికళపై దీప తీవ్ర వ్యాఖ్యలు, నవ్వేసిన పన్నీరుసెల్వం, ఇది వెంకయ్య మాట..
తమిళనాడు ముఖ్యమంత్రి శశికళ పీఠం పైన కూర్చోబోతున్నారనే ప్రచారం పైన ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఆదివారం నాడు తనదైన శైలిలో స్పందించారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి శశికళ పీఠం పైన కూర్చోబోతున్నారనే ప్రచారం పైన ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఆదివారం నాడు తనదైన శైలిలో స్పందించారు. దీనిపై విలేకరులు అడగగా.. ఆయన తొలుత నవ్వేశారు. ఆ తర్వాత మాట్లాడారు. తాను సముద్రంలోని అలలాంటివాడినని, అంతా దైవ నిర్ణయమని చెప్పారు.
ముఖ్యమంత్రి పీఠంపై శశికళ ఆసీనురాలు కాబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో 'అమ్మ' జయలలిత మేనకోడలు దీప జయకుమార్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. శశికళ అనుసరిస్తున్న వైఖరి స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు సైన్యం చేసే విన్యాసంలా ఉందని మండిపడ్డారు.

శశికళకు సీఎం పదవిపై ప్రచారం జరుగుతున్నప్పటికీ తుది నిర్ణయం వరకు వేచి చూడాలని తెలిపారు. అయితే అకస్మాత్తుగా జరిగే అధికార మార్పిడికి ప్రజామోదం లభించే అవకాశాన్ని దీప తోసిపుచ్చారు. ఆమెకు ప్రజామోదం లేదన్నారు.
ఆ పార్టీ అంతర్గత విషయం: వెంకయ్య
అన్నాడీఎంకేలో జరుగుతున్న పరిణామాల పైన కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు స్పందించారు. అది ఆ పార్టీ అంతర్గత విషయమని చెప్పారు. ఆ పార్టీలో ఎవరు ప్రధాన కార్యదర్శి, ఎవరు ఏమిటనే అంశాలు తమకు సంబంధం లేదన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications