దీదీ సంచలనం : బీజేపీకి ఓటేయమంటోన్న కేంద్ర బలగాలు
కోల్ కతా : టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీకి ఓట్లు వేయాలని కేంద్ర బలగాలు ఓటర్లను కోరుతున్నాయని పేర్కొన్నారు. మల్దాహదక్షిణ్, బలూర్ ఘాట్ నియోజకవర్గాల్లో వయోజనులను ఓటేయమని కోరారాని ఉద్ధాటించారు. ఈ అంశంపై ఎన్నికల సంఘానికి కూడా సమాచారం అందజేశామని ఆమె పేర్కొన్నారు.

అలా ఎలా అడుగుతారు
మల్ధాహదక్షిణ్ నియోజకవర్గం ఇంగ్లిష్ బజార్ ప్రాంతంలో పోలింగ్ కేంద్రాల్లో బలగాలు ఈ మేరకు కోరాయని ఆమె తెలిపారు. వారికి అలా కోరే హక్కు లేదని గుర్తుచేశారు. దీనిపై ఈసీకి నివేదించామని ... పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాలకు పనేముందుని ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్థలే గాక కేంద్ర బలగాలను బీజపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడాన్ని మమతా తప్పుపట్టారు. 2016లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఇదేవిధంగా వ్యవహరించిందని ఆరోపించారు. కానీ బీజేపీకి ప్రజలు సరైన సమాధానం చెప్పారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications