ఐఐటీ మద్రాస్ విద్యార్థిని ఆత్మహత్య, మొబైల్ లో సూసైడ్ నోట్, ఉత్తరాధి ప్రొఫెసర్లు !
చెన్నై: కేరళ రాష్ట్రంలోని కొల్లంకు చెందిన ఫాతిమా లతీఫ్ (19) చెన్నై ఐఐటీలో ఆత్మహత్య చేసుకున్న కేసు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెన్నై నగర పోలీసులు తెలిపారు. చెన్నై ఐఐటీలో గత ఆగస్టులో చేరిన ఫాతిమా లతీఫ్ మూడు నెలల్లోనే ఆత్మహత్య చేసుకోవడంతో కలకలం రేపింది. తన కుమార్తె ఫాతిమా లతీఫ్ ఆత్మహత్యకు ముగ్గురు ప్రొఫెసర్లు కారణం అని, వారీ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె తండ్రి అబ్దుల్ లతీఫ్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, తమిళనాడు డీజీపీ త్రిపాఠీలకు ఫిర్యాదు చేశారు.
చెన్నై ఐఐటీ కాలేజ్ లో చేరిన మూడు నెలలకే ఫాతిమా లతీఫ్ హాస్టల్ గదిలో ఈనెల 9వ తేదీన ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

మొబైల్ లో సూసైడ్ నోట్
ఫాతిమా లతీఫ్ ఆత్మహత్య చేసుకునే ముందు మొబైల్ లో సూసైడ్ నోట్ మాకు పంపించిందని ఆమె తండ్రి అబ్దుల్ లతీఫ్ ఆరోపించారు. ఫాతిమా మొబైల్ లోని సూసైడ్ నోట్ లో ఉమా, చక్కు, వప్పిచ, తుంపు అనే పేర్లు ఉన్నాయని, వారే ఆమె ఆత్మహత్యకు కారణం అయ్యారని, వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అబ్దుల్ లతీఫ్ సీఎం ఎడప్పాడి పళనిస్వామి, డీజీపీ త్రిపాఠీలకు మనవి చేశారు.

సెల్ ఫోన్ లో వివరాలు !
తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి, డీజీపీ త్రిపాఠీలను కలిసిన తరువాత ఫాతిమా లతీఫ్ తండ్రి అబ్దుల్ లతీఫ్ చెన్నైలో మీడియాతో మాట్లాడారు. తన ఆత్మహత్యకు కారణం ముగ్గురు ప్రొఫెసర్లు అని తన కుమార్తె ఫాతిమా లతీఫ్ సెల్ ఫోన్ లో నమోదు చేసిందని అబ్దుల్ లతీఫ్ అన్నారు.

కఠిన చర్యలు
తన కుమార్తె ఫాతిమా లతీఫ్ ఆరోపించిన ప్రొఫెసర్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఎడప్పాడి పళనిస్వామి, డీజీపీ త్రిపాఠీలకు తాను మనవి చేశానని, తప్పకుండా న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చారని అబ్దుల్ లతీఫ్ మీడియాకు చెప్పారు.

డీఎంకే ఆందోళన
మరో వైపు ఫాతీమా లతీఫ్ ఆత్మహత్యకు కారణమైన ప్రొఫెసర్లను అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేస్తూ డీఎంకే పార్టీ అధ్వర్యంలో చెన్నై ఐఐటీని ముట్టడించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులతో పాటు, డీఎంకే పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాజకీయం చేస్తారా: బీజేపీ
ఫాతిమా లతీఫ్ ఆత్మహత్మను రాజకీయం చెయ్యడానికి డీఎంకే ప్రయత్నిస్తోందని బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి వాసతి శ్రీనివాసన్ విమర్శించారు. ఫాతిమా ఆత్మహత్య తమను భాదించిందని, అయితే ఆమె ఆత్మహత్యను రాజకీయం చెయ్యడం ఎంత వరకు న్యాయమని వాసతి శ్రీనివాసన్ ప్రశ్నిస్తున్నారు.

చెన్నై ఐఐటీలో 9 మంది ఆత్మహత్య
చెన్నై ఐఐటీలో ఇప్పటి వరకూ 9 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఉత్తరాధి రాష్ట్రాలకు చెందిన ప్రొఫెసర్లు దక్షిణాధి రాష్ట్రాల విద్యార్థులను చిన్న చూపు చూస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని, అందుకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెన్నై ఐఐటీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications